News October 26, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్ విడుదల

image

ఎచ్చెర్లలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డా.ఎస్.ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నవంబరు 4 నుంచి 18వ తేదీ వరకు, తృతీయ సంవత్సరం నవంబరు 20 నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వర్సిటీ కేంద్రంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News November 18, 2025

గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

image

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News November 18, 2025

గుప్పిడి పేట: సముద్రంలో తెప్ప బోల్తాపడి మత్స్యకారుడు మృతి

image

సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మంగళవారం ఉదయం గుప్పిడిపేటకు చెందిన మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య (45) తెప్పపై సముద్రంలోకి వెళుతుండగా బోల్తా పడి మునిగి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

News November 18, 2025

ఎచ్చెర్ల: నన్ను కాపాడండి సార్.. చిన్నారి వేడుకోలు..!

image

ఎచ్చెర్లలోని ముద్దాడకు చెందిన ఐదేళ్ల సింధు నందన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యులు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని సూచించారు. అయితే ఆ చికిత్సకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. తమ ఆర్థిత స్థోమత సరిగాలేదని ప్రభుత్వం ఆదుకుని తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.