News July 1, 2024
ఎచ్చెర్ల : నేటి నుంచి ఈఏపీసెట్ కౌన్సిలింగ్

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీసెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమవుతుందని సహాయ కేంద్ర జిల్లా సమన్వయకర్త జి.దామోదర్రావు ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ స్ట్రీమ్కు జులై 1నుంచి 7తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు కౌన్సిలింగ్ రుసుం చెల్లించాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1200 ఎస్సీ, ఎస్టీలు 600 చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News December 19, 2025
ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.inలో పొందుపరిచినట్లు తెలిపారు. మొత్తం 178 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
News December 19, 2025
నరసన్నపేట: విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న DEO

నరసన్నపేటపేట మండలం సత్యవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం DEO రవిబాబు సందర్శించారు. అనంతరం ఉపాద్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, పాఠశాలలోని పలు రికార్డులు పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.
News December 19, 2025
నరసన్నపేట: విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న DEO

నరసన్నపేటపేట మండలం సత్యవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం DEO రవిబాబు సందర్శించారు. అనంతరం ఉపాద్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, పాఠశాలలోని పలు రికార్డులు పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.


