News January 8, 2025

ఎచ్చెర్ల: బంగారం చోరీ.. ఆపై తనఖా.!

image

ఎచ్చెర్ల మండల పరిధిలో వివిధ చోరీలకు పాల్పడుతున్న అనుమానితుడిని పోలీసులు విచారించగా మొత్తం కక్కేశాడు. గత నెలలో కేశవరావుపేట గ్రామంలో ఓ వ్యక్తి ఇంట్లో బంగారం పోయింది. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండు నెలల క్రితం ఫరీదుపేటలో ఓ మహిళ ఇంట్లో బంగారం చోరీకి గురవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఫైనాన్స్‌లో బంగారం తనఖా పెట్టినట్లు చెప్పాడు.

Similar News

News January 22, 2025

పలాస: పశువుల పాక కన్నా ఘోరంగా అంగన్వాడీ కేంద్రం

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండల ఎంపీపీ గ్రామమైన మోదుగులపుట్టి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పశువుల పాక కన్నా అధ్వానంగా ఉంది. కనీసం తలుపులు (తడకలు) లేకుండా ఇరుకైన ప్రదేశంలో ఐదుగురు చిన్నారులు ఇక్కడ చదువుతున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో వీరితోపాటు ముగ్గురు గర్భిణీలు, ఇద్దరు బాలింతలు వస్తూ ఉంటారు. అదే ఇరుకైన గదిలో వంట సామగ్రితో పాటు నాడు-నేడు సామగ్రి కూడా అక్కడే భద్రపరిచారు.

News January 22, 2025

శ్రీకాకుళం: ఏంటి ఈ హెలికాప్టర్ టూరిజం..! 

image

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News January 22, 2025

రణస్థలం: బాలికపై యువకుడి అఘాయిత్యం

image

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. జె.ఆర్ పురం ఎస్.ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరకు బాలిక వ్యవహార శైలిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎన్. ప్రసాద్ అనే యువకుడు బాలికను గ్రామ సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.