News April 27, 2024

ఎచ్చెర్ల: మళ్లీ వైసీపీ గూటికి చేరిన పైడి శ్రీనివాసరావు

image

ఇటీవల వైసీపీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పైడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మళ్లీ వైసీపీలో చేరారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అనకాపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గానికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

శ్రీకాకుళంలో వ్యక్తి ఆత్మహత్య

image

శ్రీకాకుళంలోని వాంబే కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్ఐ హరికృష్ణ వివరాల ప్రకారం.. యడగళ్ల పవన్ కుమార్ (27) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు. బుధవారం ఉదయం నివాసం సమీపంలోని ఇదే సముదాయంలోని 17వ నంబరు బ్లాక్‌లో ఖాళీగా ఉన్న ఇంటిలో ఉరి వేసుకొని ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 25, 2026

ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్‌ షెడ్యూల్‌ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.

News February 25, 2026

శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రధాన సమస్య..

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాకాలంలో ప్రధానంగా సీజనల్‌గా డయేరియా కేసులు గ్రామాల్లో కనిపిస్తుంటాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, కలుషితనీరు ఒక సమస్య. నాలుగేళ్ల క్రితం శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT ) ఎస్ఎంపురం క్యాంపస్‌లో 170 మంది విద్యార్థుల వరకు డయేరియాతో బాధపడ్డారు. నీటి పరీక్షలు అనంతరం ఓ బోరును శాశ్వతంగా మూసివేశారు.