News October 7, 2024
ఎచ్చెర్ల: రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి: ఎంపీ

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒడిశా రాష్ట్రాన్ని కలుపుతూ నూతన రైల్వే లైన్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఎచ్చెర్ల నాయకులు, VZM ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సౌత్ రీజియన్లో ఉన్న రైల్వే సమస్యలను ఆయన వద్ద ప్రస్తావించారు. ఎంపీతో పాటుగా
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ ఉన్నారు.
Similar News
News December 7, 2025
జాక్ పాట్ కొట్టిన సిక్కోలు కుర్రాడు.. రూ.92 లక్షలతో ఉద్యోగం

శ్రీకాకుళం పట్టణం బలగ సమీపంలోని శిరిడిసాయి నగర్కు చెందిన విద్యార్థి మెండ హిమవంశి రూ.92 లక్షల వార్షిక వేతనంలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ అబ్బాయి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు. దిల్లీకి చెందిన గ్రావిటన్ రీసెర్చ్ క్యాపిటల్ ఎల్.ఎల్.బి సంస్థ ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్కు ఎంపికయ్యాడు. పేరెంట్స్, టీచర్లు, కాలనీవాసులు కుర్రాడిని అభినందించారు.
News December 7, 2025
ఎచ్చెర్ల : జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా భాస్కరరావు

ముద్దాడ రేషన్ డిపో డీలర్ పగడ భాస్కరరావును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమిస్తూ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ రేషన్ డిపోలో పారదర్శకతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. తనకు అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా చేస్తానని భాస్కర్ రావు తెలిపారు.
News December 7, 2025
SKLM: నేడు ఎన్ఎంఎంఎన్ ఎగ్జామ్..పరీక్షా కేంద్రాలివే

విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయ ప్రతిభా ఉపకార వేతనం(ఎన్ఎంఎంఎన్) ద్వారా స్కాలర్షిప్ను అందిస్తుంది. దీని కోసం NMMN ఎగ్జామ్ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 8వతరగతి విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాగా..ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి నెల రూ.1000లను ఇస్తూ ఏడాదికి రూ.12వేలను అందిస్తుంది. నేడు పలాస, టెక్కలి, శ్రీకాకుళంలో ఉదయం 10-1 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.


