News March 29, 2024

ఎచ్చెర్ల TO విజయనగరం

image

ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఎచ్చెర్ల MLA టికెట్ ఆశించిన కిమిడి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడుకు ఆ పార్టీ విజయనగరంలో అవకాశం కల్పించింది. విజయనగరం ఎంపీగా కలిశెట్టి, చీపురుపల్లి ఎమ్మెల్యేగా కళా పోటీ చేయనున్నారు. ఇన్ని రోజులు ఎచ్చెర్ల స్థానం కోసం వీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోవడంతో టీడీపీకి తలనొప్పిగా మారింది. మరి ఆ ఇద్దరూ అక్కడ ఎలా వ్యహరిస్తారో చూడాలి మరి.

Similar News

News December 4, 2025

ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

image

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.

News December 4, 2025

SKLM: ‘ఆలయాల్లో దొంగతనాలు చేసిన ముగ్గురి అరెస్ట్’

image

జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1,71,000 స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద గురువారం వెల్లడించారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఈ ముగ్గురూ గతంలో ఆముదాలవలసలో మోటార్ బైకుల దొంగతనం కేసులో 45 రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు కూడా డీఎస్పీ వెల్లడించారు.

News December 4, 2025

శ్రీకాకుళం: ‘గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు’

image

ప్రభుత్వం గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేషన్‌కు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ ) వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం రాష్ట్రం యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ భాగం ఏర్పాటు చేశారు. డీడీఓగా అరుంధతి దేవిని నియమించారు. జిల్లాలో 657 గ్రామ సచివాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి.