News March 29, 2024

ఎట్టకేలకు గంటా శ్రీనివాసరావు సీటు ఖరారు

image

ఉత్కంఠ రేపిన గంటా శ్రీనివాసరావు పోటీచేసే స్థానాన్ని ఎట్టకేలకు టీడీపీ ఖరారు చేసింది. భీమిలి నుంచి బరిలో ఉంటారని తుదిజాబితాలో వెల్లడించింది. ప్రస్తుతం విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. ఈసారి కూడా ఆయన పోటీచేసే స్థానం మారడం గమనార్హం. చీపురుపల్లి నుంచి ఆయన పోటీచేస్తారని ఊహాగానాలు వచ్చినా అక్కడి నుంచి కళా వెంకట్రావు బరిలో ఉన్నారు. కాగా భీమిలి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీచేస్తున్నారు.

Similar News

News February 9, 2026

తీరు మారకపోతే కఠిన చర్యలు: విశాఖ కలెక్టర్

image

కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన PGRSలో భాగంగా అధికారులను ఉద్దేశించి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడారు. 25 శాతం కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న అధికారులకు మెమోలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రజా వినతుల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తున్న టీపీవో-6కి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ పనితీరును నెల రోజులు సూక్ష్మంగా పరిశీలిస్తానని, తీరు మారకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 8, 2026

విశాఖ: కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

image

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.

News February 8, 2026

కేజీహెచ్ జీఎన్ఎం పరీక్షలో మాస్ కాపీయింగ్.. ముగ్గురు డిబార్

image

విశాఖ కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు కౌన్సిల్ డైరెక్టర్ సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు అధికారులు తెలిపారు.