News November 11, 2024

ఎడపల్లి: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

మూత్ర విసర్జన కోసం వెళ్లి రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫారానికి చెందిన మహ్మద్ ఖాసీం (71) సోమవారం ఉదయం ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద మూత్ర విసర్జన కోసం వెళ్లి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొని తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వివరించారు.

Similar News

News January 11, 2026

NZB: అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట, కోడిపందెలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని CP సాయి చైతన్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు.

News January 11, 2026

నిజామాబాద్: మందు బాబులపై ఉక్కుపాదం..!

image

NZB జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 5 రోజుల్లో నిర్వహించిన తనిఖీల్లో దొరికిన 232 మందిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రూ. 22.40 లక్షల జరిమానా విధించింది. వీరిలో 6గురికి జైలు శిక్ష పడింది. ‘ఒక్కసారి దొరికితే రూ.10 వేల జరిమానా’ తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆదివారం, పండుగ వేళల్లో విందులు చేసుకునే వారు వాహనాలు నడపరాదని పోలీసులు సూచిస్తున్నారు.

News January 11, 2026

నిజామాబాద్ జిల్లా పద్మశాలి కాలమానిని ఆవిష్కరణ

image

పద్మశాలి భవనంలో పద్మశాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాలమానిని – 2026ను సంఘం ప్రతినిధులు ఆవిష్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు చౌకే వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఐక్యతకు, సంక్షేమానికి సంఘం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆసమ్ నవీన్, కోశాధికారి బాస దేవిదాస్, భూమేశ్వర్, రుద్ర గణపతి, భోజదాస్ పాల్గొన్నారు.