News January 29, 2025

ఎడపల్లి: బ్యాంకు ఉద్యోగి వెంటబడిన పులి

image

ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ ఎస్బీఐ బ్రాంచ్ లో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న మాసూద్ మంగళవారం రోజువారీగా విధులకు వచ్చాడు. అయితే పెండింగ్ పనులు ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు ఆలస్యమైంది. పనులు పూర్తి చేసుకొని 7 గంటల ప్రాంతంలో ఠాణాకలాన్ నుంచి బైక్‌పై వెళుతుండగా మార్గమధ్యలో సబ్స్టేషన్ ప్రాంతంలో ఓ పులి వెంటబడింది. బైక్ స్పీడ్ పెంచడంతో పులి భారీ నుంచి తప్పించుకున్నట్లు ఆయన తెలిపాడు.

Similar News

News November 23, 2025

GNT: ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహం కలకలం

image

నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీసీ వద్ద కాల్వలో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న రక్షక్ సిబ్బంది ఐటీసీ ప్రహరీగోడకు ఆనుకొని ఉన్న కాల్వలో మృతదేహాన్ని గుర్తించి స్థానికంగా ఆరా తీశారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీకి తరలించారు. గుర్తుతెలియని మృతదేహానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 23, 2025

సూర్యాపేట: గుడిపాటి నరసయ్య రాజకీయ నేపథ్యం

image

సూర్యాపేట DCC అధ్యక్షుడిగా గుడిపాటి నరసయ్య నియమితులయ్యారు. తుంగతుర్తి(M) వెలుగుపల్లికి చెందిన ఈయన 1990-95 వరకు PPIML చండ్ర పుల్లా రెడ్డి నక్సల్ గ్రూప్‌లో పనిచేశారు. 2001-6 వరకు ZPTCగా, 2006-08 వరకు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009లో MLAగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టికెట్ ఆశించినా దక్కలేదు.

News November 23, 2025

నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

image

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.