News January 29, 2025

ఎడపల్లి: బ్యాంకు ఉద్యోగి వెంటబడిన పులి

image

ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ ఎస్బీఐ బ్రాంచ్ లో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న మాసూద్ మంగళవారం రోజువారీగా విధులకు వచ్చాడు. అయితే పెండింగ్ పనులు ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు ఆలస్యమైంది. పనులు పూర్తి చేసుకొని 7 గంటల ప్రాంతంలో ఠాణాకలాన్ నుంచి బైక్‌పై వెళుతుండగా మార్గమధ్యలో సబ్స్టేషన్ ప్రాంతంలో ఓ పులి వెంటబడింది. బైక్ స్పీడ్ పెంచడంతో పులి భారీ నుంచి తప్పించుకున్నట్లు ఆయన తెలిపాడు.

Similar News

News December 4, 2025

మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న మంత్రి

image

మేడారం సమ్మక్క-సారలమ్మలను గురువారం రాత్రి మంత్రి సీతక్క దర్శించుకున్నారు. 2026 జనవరిలో జరిగే మహాజాతర సందర్భంగా జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల నూతన గద్దెల పనులను పరిశీలించిన మంత్రి.. జాతర ముందే నిర్మాణ పనులను పూర్తి చేస్తామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

News December 4, 2025

సిగాచి బాధితులకు కోటి పరిహారం ఇవ్వాలి: జేఏసీ

image

పాశమైలారం సమీపంలోని సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం వెంటనే ఇవ్వాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ జిల్లా చైర్మన్ వై. అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం పరిశ్రమ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఇప్పటివరకు ఎనిమిది మందికి డెత్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

News December 4, 2025

11వ తేదీ కడప మేయర్ ఎన్నిక జరగకపోతే?

image

కడప మేయర్ ఎన్నికకు <<18470673>>నోటిఫికేషన్<<>> విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు. ఒకవేళ 11వ తేదీ ఎన్నిక జరగకపోతే.. రిజర్వ్ డే (12వ తేది)న ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటికీ ఎన్నిక జరగకుంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తర్వాతి తేదీని వెల్లడిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.