News January 29, 2025
ఎడపల్లి: బ్యాంకు ఉద్యోగి వెంటబడిన పులి

ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ ఎస్బీఐ బ్రాంచ్ లో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్న మాసూద్ మంగళవారం రోజువారీగా విధులకు వచ్చాడు. అయితే పెండింగ్ పనులు ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు ఆలస్యమైంది. పనులు పూర్తి చేసుకొని 7 గంటల ప్రాంతంలో ఠాణాకలాన్ నుంచి బైక్పై వెళుతుండగా మార్గమధ్యలో సబ్స్టేషన్ ప్రాంతంలో ఓ పులి వెంటబడింది. బైక్ స్పీడ్ పెంచడంతో పులి భారీ నుంచి తప్పించుకున్నట్లు ఆయన తెలిపాడు.
Similar News
News November 7, 2025
నవీన్ యాదవ్పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
News November 7, 2025
వందేమాతర 150వ సంవత్సరోత్సవం: పెద్దపల్లి కలెక్టర్

వందేమాతర గేయం 150 సంవత్సరాలు పూర్తి కావడం సందర్భంగా ఈనెల 7వ తేదీ ఉదయం 9:45 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News November 7, 2025
కట్టెల పొయ్యిపై వంట చేస్తే చర్యలు: వనపర్తి కలెక్టర్

జిల్లాలోని మధ్యాహ్నం భోజనం అందించే ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ నిధుల నుంచి LPG సిలిండర్లు ఇప్పించడం జరుగుతుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సిలిండర్ తీసుకున్న తర్వాత కట్టెల పొయ్యిపై వంట చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సిలిండర్ అందని పాఠశాలలను గుర్తించి వెంటనే సిలిండర్ అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


