News January 29, 2025

ఎడపల్లి: బ్యాంకు ఉద్యోగి వెంటబడిన పులి

image

ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ ఎస్బీఐ బ్రాంచ్ లో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న మాసూద్ మంగళవారం రోజువారీగా విధులకు వచ్చాడు. అయితే పెండింగ్ పనులు ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు ఆలస్యమైంది. పనులు పూర్తి చేసుకొని 7 గంటల ప్రాంతంలో ఠాణాకలాన్ నుంచి బైక్‌పై వెళుతుండగా మార్గమధ్యలో సబ్స్టేషన్ ప్రాంతంలో ఓ పులి వెంటబడింది. బైక్ స్పీడ్ పెంచడంతో పులి భారీ నుంచి తప్పించుకున్నట్లు ఆయన తెలిపాడు.

Similar News

News November 24, 2025

రైతుల ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి నాదెండ్ల

image

భీమడోలు మండలం గుండుగొలను ఖరీఫ్ వరి ధాన్యం పట్టుబడి పడుతున్న రైతులను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కలిశారు. ఈమేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఉన్న ఇబ్బందులు రైతులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థంగా అమలవుతున్నాయా అన్న అంశాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు.

News November 24, 2025

పార్వతీపురం: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం, గుమ్మలక్ష్మీపురం, బలిజిపేట, పార్వతీపురం, గరుగుబిల్లి మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఇక్కడ<> క్లిక్ <<>>చేసి వివరాలు నమోదు చేయండి.

News November 24, 2025

టమాటా కేజీ రూ.80!

image

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.