News January 29, 2025
ఎడపల్లి: బ్యాంకు ఉద్యోగి వెంటబడిన పులి

ఎడపల్లి మండలంలోని ఠాణాకలాన్ ఎస్బీఐ బ్రాంచ్ లో క్యాషియర్గా విధులు నిర్వహిస్తున్న మాసూద్ మంగళవారం రోజువారీగా విధులకు వచ్చాడు. అయితే పెండింగ్ పనులు ఉండటంతో ఇంటికి వెళ్లేందుకు ఆలస్యమైంది. పనులు పూర్తి చేసుకొని 7 గంటల ప్రాంతంలో ఠాణాకలాన్ నుంచి బైక్పై వెళుతుండగా మార్గమధ్యలో సబ్స్టేషన్ ప్రాంతంలో ఓ పులి వెంటబడింది. బైక్ స్పీడ్ పెంచడంతో పులి భారీ నుంచి తప్పించుకున్నట్లు ఆయన తెలిపాడు.
Similar News
News December 1, 2025
బాపట్ల: వీడియోలు చూపించి అత్యాచారంపై కేసు నమోదు

చీరాలకు చెందిన ఓ మహిళ తనను బెదిరించి అత్యాచారం చేశారని బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. టౌన్ పోలీసులు న్యాయవాది తులసీరావు, టీడీపీ మహిళా కార్యకర్త రజని సహా 8 మందిపై కేసు నమోదు చేశారు. వీడియోలు చూపించి బెదిరించి అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నట్లు టౌన్ సీఐ రాంబాబు తెలిపారు.
News December 1, 2025
ఉమ్మడి నల్గొండలో పార్టీ బలోపేతంపై BJP ఫోకస్..!

తెలంగాణలో బీజేపీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు జిల్లాల ఇన్ఛార్జ్లను కొత్తగా నియమించారు. జిల్లాల వారీగా నాయకత్వ మార్పులు చేసి, గ్రౌండ్లో కార్యకర్తలతో అనుసంధానం, పంచాయతీ ఎన్నికల వేళ దూకుడు పెంచాలని పార్టీ భావిస్తోంది. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్గా ఉదయ్ను నియమించగా, సూర్యాపేటకు టీ.రమేశ్, యాదాద్రి భువనగిరికి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు.
News December 1, 2025
అధ్యక్షా.. రైల్వే పెండింగ్ పనులు పూర్తి చేయండి!

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొననున్నారు. జిల్లాకు చెందిన నడికుడి – కాళహస్తి రైల్వే లైన్, ఎప్పటి నుండో వేచి ఉన్న గిద్దలూరు రైల్వే గేటు బ్రిడ్జి, ఇతర రైల్వే అభివృద్ధి పనులు, పొగాకు రైతుల సమస్యలపై, అల్లూరు వద్ద ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్ట్, పలు అభివృద్ధి అంశాలపై ఎంపీ గళమెత్తాలని ప్రజలు కోరుతున్నారు. మరి MP ఏం ప్రస్తావిస్తారో చూడాల్సి ఉంది.


