News March 28, 2024

ఎడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

image

మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు, ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వైపు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి NRI ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 7, 2026

రాజధాని అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్.!

image

మంగళగిరి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పశ్చిమ బైపాస్ సంక్రాంతికి పాక్షికంగా అందుబాటులోకి తేవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు నిర్ణయించారు. అమరావతి రాజధానిలో కీలకంగా నిలవనున్న ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే NH 16, విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. చినకాకాని నుంచి గొల్లపూడి వరకు 17.636 కిలోమీటర్ల మేర రూ.1,546 కోట్ల వ్యయంతో బైపాస్ నిర్మాణాన్ని చేపట్టారు.

News January 7, 2026

GNT: ధరల పతనానికి బ్రేక్‌.. మిర్చి మార్కెట్‌లో ప్రభుత్వం ఫుల్‌ కంట్రోల్

image

గతేడాది మిర్చి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన సమీక్షలో మిర్చి ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయన్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉత్పాదకత 44 శాతం తగ్గిందని, రైతులకు నష్టమేమీ కలగకుండా ఇ-క్రాప్ 100 శాతం అమలు, రసీదులు తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2026

GNT: గుడ్ న్యూస్.. వారికి కేవలం రూ.1కే నెలంతా ఫ్రీ

image

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GB డేటా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.