News March 12, 2025

ఎడ్ల బండ్ల ప్రబలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

WGL(D) గీసుగొండ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతర ప్రత్యేకమైనది. ఉమ్మడి జిల్లా నుంచి ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రబలతో ఇక్కడికి రావడం ఆనవాయితీ. జిల్లాలోని లంబాడా జాతులవారు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదయం హోలీ జరుపుకున్న తర్వాత నుంచి జాతరకు పోటెత్తుతారు. కోలాటాలు, లంబాడా నత్యాలతో ఆలయం చుట్టూ ప్రబలు తిరుగుంటే చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. మరి జాతరకు మీరు వెళ్తున్నారా?

Similar News

News April 17, 2026

HYDలో భారీ మోసం.. బాధితుల్లో ఎక్కువ వారే

image

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట సాగుతున్న మోసంపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారిక లోగోలను వాడుతూ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50వేల- రూ.లక్ష వరకు వసూలు చేశారు. 6 నెలల్లోనే ఈ తరహా మోసాలపై సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో 120కిపైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులే ఉండటం గమనార్హం.

News April 17, 2026

ఇంకా క్రేజీ రీల్స్ చేస్తా: అర్ష్‌దీప్

image

అర్ష్‌దీప్ సింగ్ IPLలో 100 వికెట్ల క్లబ్‌లో చేరిపోయారు. గ్రౌండ్‌లో నిప్పులు చెరిగే బాల్స్‌తో భయపెట్టే ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. బయట మాత్రం ఫుల్ జోవియల్‌గా ఉంటారు. తనకు ఇన్‌స్టా రీల్స్ చేయడం అంటే ఇష్టమని, ఫ్యాన్స్ కూడా ఆటతో పాటు రీల్స్ చూసి బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు. తన సోషల్ మీడియా క్రేజ్ వల్లే దేశమంతటా సపోర్ట్ లభిస్తోందని.. ఫ్యాన్స్ కోసం మరిన్ని క్రేజీ రీల్స్ చేస్తానని ప్రామిస్ చేశారు.

News April 17, 2026

HYDలో భారీ మోసం.. బాధితుల్లో ఎక్కువ వారే

image

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాల పేరిట సాగుతున్న మోసంపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారిక లోగోలను వాడుతూ నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు సృష్టించి, సెక్యూరిటీ డిపాజిట్ పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.50వేల- రూ.లక్ష వరకు వసూలు చేశారు. 6 నెలల్లోనే ఈ తరహా మోసాలపై సిటీ సైబర్ క్రైమ్ విభాగంలో 120కిపైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులే ఉండటం గమనార్హం.