News January 21, 2025
ఎదురుకాల్పుల్లో కీలక నేతలు మృతి?

ఛత్తీస్ఘడ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, ఒడిశా మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జ్ మొండెం బాలకృష్ణ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అధికారికంగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా గాలింపు చర్యలు జరుగుతుండగా,మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యమయ్యాయి.
Similar News
News February 13, 2025
రూ.8వేలతో విశాఖ నుంచి కుంభమేళాకు

ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి కుంభమేళాకు ప్రత్యేక బస్సు నడపనున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. ఫిబ్రవరి 16న ద్వారకా బస్సు స్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడుపబడునన్నారు. టికెట్ ధర రూ.8 వేలు. టికెట్స్ కావలసినవారు ఆన్లైన్ ద్వారా గాని, సమీప బస్ స్టేషన్లోగాని పొందవచ్చన్నారు.
News February 13, 2025
విశాఖ వైసీపీ ఉపాధ్యక్షుడిగా బాణాల

విశాఖ జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడిగా బాణాల శ్రీనివాసును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. గడిచిన ఎన్నికల్లో బాణాల శ్రీనివాసరావు వైసీపీకి కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన జీవీఎంసీ 44వ వార్డు కార్పొరేటర్గా ఉన్నారు. జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్గా పనిచేస్తున్నారు.
News February 13, 2025
‘ఆ కేసులను త్వరితంగా పరిష్కరించాలి’

హిట్ & రన్ నష్ట పరిహార కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రవాణా శాఖ, పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం అయ్యారు. హిట్ అండ్ రన్ కేసుల విషయంలో సత్వరమే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్కు పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం క్లెయిమ్ దరఖాస్తులలో లోపలను గుర్తించి పరిష్కరించాలన్నారు.