News March 19, 2024
ఎదురు కాల్పులు..మంచిర్యాల జిల్లా మావోలు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూర్ ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో మెుత్తం నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఏకే-47, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 17, 2025
ఆదిలాబాద్ జిల్లా వెదర్ అప్డేట్

ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు కాస్త ఎడతెరిపినిచ్చాయి. ఆదిలాబాద్ రూరల్ మండలంలో 13.8 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. జిల్లాలో అక్కడక్కడ చిరు జల్లులు మాత్రమే కురిశాయి. రైతులు వాతావరణ పరిస్థితులు గమనించి సాగు పనులు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
News September 17, 2025
ADB: ‘చేయి’ కలుపుతారా.. కలిసి పనిచేస్తారా?

ADB జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంజీవరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ ప్రధానకార్యదర్శి గండ్రత్ సుజాత పార్టీలో చేరడంతో ఓ వర్గం అసంతృప్తిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి పనిచేస్తారా..? కలిస్తే లోకల్ పోరులో వీరి ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
News September 16, 2025
ఆదిలాబాద్: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జూలై నెలలో రాసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఈ https://braou.ac.in/result#gsc.tab=0 వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.