News July 21, 2024

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి

image

జేగురుకొండ అడవుల్లో శనివారం జరిగిన ఎన్ కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. జేగురుకొండ అడవు ల్లోని సింగవరం, తుమర్ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో డీఆర్డీ బలగాలు కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఒక తుపాకీ, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన మావోయిస్టును గుర్తించాల్సి ఉందన్నారు.

Similar News

News January 9, 2026

యూరియా కోసం రైతుల పాట్లు.. అధికారుల ప్రకటనలకే పరిమితం!

image

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత రైతులను వేధిస్తోంది. సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఎరువుల కోసం రైతులు కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. అధికారుల సమన్వయ లోపంతో పంట పనులు వదులుకుని పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరాలో నిర్లక్ష్యం వీడి, తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని అన్నదాతలు కోరుతున్నారు.

News January 9, 2026

మున్సిపల్ పోరు.. అందరి దృష్టి మంత్రి పొంగులేటి ఇలాఖాపైనే..!

image

ఏడు పంచాయతీల విలీనంతో 20 వార్డులు, 18,868 మంది ఓటర్లతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించింది. ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడంతో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రేపు ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల కానుండటంతో అభ్యర్థుల వేట మొదలైంది. భవిష్యత్‌లో కల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంగా మారుతుందనే ప్రచారం జరుగుతుండటంతో, ఇక్కడ పట్టు సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాల్లో మునిగిపోయాయి.

News January 9, 2026

46 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు: డీఈవో

image

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ, సెలవుల వల్ల ఏర్పడిన ఖాళీల్లో 46 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ డీఈవో చైతన్యజైనీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్, డిసెంబర్ నెలల ఖాళీలతో పాటు సెక్టోరల్ విభాగాల్లోని ఏఎంవో, జీసీడీవో స్థానాల్లోనూ నియామకాలు చేపట్టారు.