News January 29, 2025
ఎనమాముల మార్కెట్ నూతన కమిటీ ప్రకటన

వరంగల్ ఎనమాముల మార్కెట్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్గా ఎర్ర ప్రియాంక, వైస్ ఛైర్మన్గా బండి జనార్దన్ను నియమించారు. మొత్తం 18 మందితో ఎనమాముల మార్కెట్ నూతన కమిటీని ప్రకటించారు. కమిటీలో రాజు, వాసుదేవ రెడ్డి, రుద్ర ప్రసాద్, శ్యాం, సబేరా, గోపాల్ రావు, ప్రదీప్ కుమార్, నాగరాజ్, సంపత్, భిక్షపతి, నరసింహ నాయక్ తదితరులు ఉన్నారు .
Similar News
News December 18, 2025
గద్వాల: ఎన్నికల ప్రక్రియ విజయవంతం- ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల జిల్లాలో 3 విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ శ్రీనివాసరావు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్ల సాధ్యమైందన్నారు. తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా పోలింగ్ సిబ్బంది, పోలీసులు గ్రామాలకు చేరుకొని ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభించి సాయంత్రం వరకు ఫలితాలు ప్రకటించి ఎన్నికలు విజయవంతం చేశారని చెప్పారు. పోలీసుల కృషిని అభినందించారు.
News December 18, 2025
నెల్లూరు: ఎక్కువ రేటుకు యూరియా ఇస్తున్నారా?

నెల్లూరు జిల్లాలో హోల్ సేల్, రిటైల్ డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని అగ్రికల్చర్ జేడీ సత్యవాణి హెచ్చరించారు. బ్లాక్లో <<18592684>>యూరియా అమ్మకాలపై <<>>Way2Newsలో వార్త రావడంతో ఆమె స్పందించారు. అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే 83310 57285కు కాల్ చేయాలని రైతులకు సూచించారు. ఈనెలాఖరున మరో 6వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు.
News December 18, 2025
రాజానగరం: రేపు నన్నయకు రానున్న నారా లోకేశ్

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాలను శుక్రవారం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారని వీసీ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. గురువారం జేసీ వై. మేఘా స్వరూప్తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఇంజినీరింగ్, ఎగ్జామినేషన్స్, స్కూల్ ఆఫ్ కామర్స్ భవనాలను మంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇదే వేదికపై రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వీసీ తెలిపారు.


