News March 19, 2025

ఎనుమాముల మార్కెట్‌లో భారీగా పెరిగిన పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 22, 2025

కృష్ణా: పల్స్ పోలియో నిర్వహణలో మన జిల్లాకే స్టేట్ ఫస్ట్.!

image

5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడంలో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 95.49% మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యుగంధర్ తెలిపారు. 1,45,588 మంది చిన్నారులకు గాను 1,39,024 మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామన్నారు.

News December 22, 2025

CSIR-SERCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (<>SERC<<>>)లో 30 సైంటిస్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ME, M.Tech( స్ట్రక్చరల్ Engg./ అప్లైడ్ మెకానిక్స్/ జియో టెక్నికల్ Engg./ ఓషియన్ Engg./ECE/CSE/IT/AI/ML)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు వెబ్‌సైట్: serc.res.in/

News December 22, 2025

పేదరిక రహిత జిల్లాగా ఎన్టీఆర్: MP చిన్ని

image

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్&బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి విశిష్ట సేవా పురస్కారాలు-2025 కార్యక్రమంలో MP కేశినేని చిన్ని, MLA గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విశిష్ట సేవా పురస్కారాలు ప్రముఖులకు అందజేశారు. NTR జిల్లాను పేదరికం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు P-4 కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.