News March 19, 2025
ఎనుమాముల మార్కెట్లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
జిల్లాలో 53 టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 53 మంది అకడమిక్ ఇన్ స్ట్రక్టర్లు నియామకం కోసం ఆదేశాలు జారీ చేశామని డీఈవో సలీం భాష గురువారం తెలిపారు. ఔత్సాహికులు శుక్రవారం లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీటిని సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. స్కూల్ అసిస్టెంట్కు రూ.12,500, SGTకి రూ.10 వేలు పారితోషకం చెల్లిస్తామన్నారు. జిల్లాలో 53 మందిని స్కూల్ అసిస్టెంట్లుగా, సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమిస్తామన్నారు.
News December 4, 2025
తిరుపతి: సరికొత్త లుక్లో పవన్ కళ్యాణ్..!

చిత్తూరులో DDO ఆఫీస్ ఓపెనింగ్ నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. సరికొత్త లుక్లో ఆయన కనిపించారు. జవాన్ స్టైల్లో షార్ట్గా క్రాప్ చేయించారు. ఫుల్ హ్యాండ్స్ జుబ్బాలో స్టైలిష్గా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నం చేశారు. గతంలో ఆయన ఆర్మీ ప్యాంట్, బ్లాక్ టీషర్టుతో తిరుపతికి వచ్చిన విషయం తెలిసిందే.
News December 4, 2025
బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


