News March 19, 2025
ఎనుమాముల మార్కెట్లో భారీగా పెరిగిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి పత్తి తీసుకొని వచ్చిన రైతులకు ధర విషయంలో ఊరట లభించింది. ఎట్టకేలకు నేడు క్వింటా పత్తి ధర రూ.7 వేల మార్కు దాటింది. సోమవారం రూ.6,825 పలికిన క్వింటా పత్తి ధర.. మంగళవారం రూ.6,975కి చేరింది. బుధవారం మరింత పెరిగి రూ.7100 అయింది. రెండు రోజుల వ్యవధిలోనే రూ.275 ధర పెరగడం పట్ల అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 28, 2025
మాటల యుద్ధం: డీకే ఏమన్నారంటే?

కర్ణాటక సీఎం, తన మధ్య SMలో <<18406507>>మాటల యుద్ధం<<>> నడుస్తోందనే ప్రచారాన్ని Dy.CM డీకే శివకుమార్ కొట్టిపారేశారు. తన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజ్యాంగ దినోత్సవం వేళ పేర్కొన్న మాటలు అలా అర్థమయ్యాయని ముంబైలో తెలిపారు. అలాగే తాను రాజకీయ భేటీ కోసం ముంబై వచ్చాననే ఆరోపణలను ఖండించారు. ఫ్యామిలీ ప్రోగ్రాంకు హాజరైనట్లు, రాజకీయ భేటీ అయితే బెంగళూరు లేదా ఢిల్లీలో ఉంటుందని స్పష్టం చేశారు.
News November 28, 2025
పంచాయతీల విభజనకు గ్రీన్సిగ్నల్

AP: స్థానిక సంస్థల ఎన్నికలకు SEC సిద్ధమవుతోంది. అందులో భాగంగా గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఒక పంచాయతీని విభజించడం/పంచాయతీలోని గ్రామాలను మరో పంచాయతీలో కలపడం/2 పంచాయతీలను విలీనం చేయడానికి వీలవుతుంది. అలాగే పంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలపడానికి మార్గం సుగుమమవుతుంది. లోకల్ ఎలక్షన్స్కు ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
News November 28, 2025
ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు..

ఉపవాసం అనేది భక్తి మార్గం మాత్రమే కాదు. ఉపవాసం పాటిస్తే మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. తద్వారా మనసు దేవుడిపై నిలిచి, ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉపవాసం ఉంటే కొలెస్ట్రాల్, షుగర్ స్థాయి తగ్గి, పొట్ట దగ్గర కొవ్వు కరిగిపోతుంది. శరీరం తనకు తానుగా మరమ్మత్తులు చేసుకుని, వయస్సును వెనక్కి నెట్టి, మనం మరింత యంగ్గా కనిపించడానికి తోడ్పడుతుంది.


