News September 17, 2024

ఎన్ఎంసీకి సీఎం లేఖ రాయడం దుర్మార్గం: తులసి రెడ్డి

image

మౌలిక వసతులు, సిబ్బంది కొరత సాకులు చూపి పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని సీఎం లేఖ రాయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సగం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. ఆ మాత్రాన వీటిని మూసేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ఎంసీకి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి మెడికల్ కళాశాల ప్రారంభించాలని కోరారు.

Similar News

News December 6, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=

News December 6, 2025

కడప: ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలపై GST దాడులు.!

image

కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్ కార్యాలయాలపై శుక్రవారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. CTO జ్ఞానానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో, CTO రాజనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కడపలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. పెనాల్టీ విధించారు. ప్రొద్దుటూరులో 4 ట్రాన్స్‌పోర్ట్, 3 ట్రావెల్ కార్యాలయాలపై దాడులు జరిగాయి.

News December 6, 2025

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్

image

ఒంటిమిట్ట ఆలయానికి 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ని రూపొందించాలని TTD EO అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు. TTD పరిపాలన భవనంలో ఆయన ఒంటిమిట్ట అధికారులతో శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, అందులో మ్యూజియం, ఉద్యానవనాలు, చెరువులో జాంబవంతుని 108 అడుగుల విగ్రహం వంటి అనేక అభివృద్ధి పనులపై చర్చించారు.