News March 3, 2025

ఎన్టీఆర్: అలర్ట్.. ఆ రైళ్ల నంబర్‌లు మారాయి

image

విజయవాడ మీదుగా ప్రయాణించే 4 రైళ్లకు మార్చి 1 నుంచి నూతన నంబర్‌లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నం- కడప తిరుమల(డైలీ) ఎక్స్‌ప్రెస్‌కు పాత నంబర్లు 17487/17488 స్థానంలో 18522/18521 నంబర్లు ఉంటాయన్నారు. అదే విధంగా వారంలో 5 రోజులు ప్రయాణించే విశాఖపట్నం- గుంటూరు ఉదయ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పాత నంబర్లు 22701/22702 స్థానంలో 22875/22876 నంబర్లు ఉంటాయని స్పష్టం చేశారు.

Similar News

News December 10, 2025

NZB: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

image

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ​ఆధార్ కార్డు, ​పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ​పాన్ కార్డు, ​బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్(ఫొటోతో), ​రేషన్ కార్డు(ఫొటోతో), ​పట్టాదారు పాస్‌బుక్, ​ఉపాధి జాబ్ కార్డు, ​దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం(ఫొటోతో), ​పెన్షన్ తదితర పత్రాల్లో ఏదోకటి చూపించాలి.

News December 10, 2025

తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

image

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.

News December 10, 2025

MBNRలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్‌కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహబూబ్‌నగర్ రూరల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పోలింగ్ జరగనుంది. ఉ.7 గంటల నుంచి మ.1 గంట వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మ.2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.