News March 9, 2025
ఎన్టీఆర్: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాలలో డైరెక్టర్లు, మేనేజర్లు, ఎక్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్సైట్లో ఈనెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 24, 2025
2 రోజులు వర్షాలు.. జాగ్రత్తలు తీసుకోండి: కలెక్టర్

రానున్న 2 రోజులు వర్ష సూచన ఉన్నందున, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ధాన్యం త్వరగా మిల్లులకు తరలించాలని, కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లేని ధాన్యాన్ని నింపి పంపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఈ 2 రోజులు కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.
News October 24, 2025
MBNR: డిగ్రీ ఫీజుకు నేడే ఆఖరు

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్లాగ్) పరీక్షల ఫీజు కట్టేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ నెల 29 వరకు ఫైన్ (లేట్ ఫీజు)తో ఫీజులు చెల్లించ వచ్చని అధికారులు తెలిపారు. మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫీజును ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించడానికి శనివారం వరకు అవకాశం ఉందన్నారు. లేట్ ఫీజుతో ఈ నెల 29 వరకు ఫీజు కట్టవచ్చని వెల్లడించారు.
News October 24, 2025
కర్నూలులో బస్సు ప్రమాదం.. యాదాద్రి యువతి సజీవ దహనం

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి(D) గుండాల(M) వస్తాకొండూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనూష సజీవ దహనమైంది. దీపావళికి సొంతూరికి వచ్చిన ఆమె, బెంగళూరు తిరుగు ప్రయాణంలో ఖైరతాబాద్లో బస్సు ఎక్కింది. ఈ ప్రమాదంలో అనూష మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


