News March 9, 2025

ఎన్టీఆర్: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 

image

ఏపీ సీఆర్డీఏలో కాంట్రాక్ట్ పద్ధతిన 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పలు విభాగాలలో డైరెక్టర్లు, మేనేజర్లు, ఎక్జిక్యూటివ్ తదితర పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఈనెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Similar News

News December 4, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

image

రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు అయ్యాయి. వీటిని రీ షెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ బుధవారం పేర్కొంది. హౌడా-సికింద్రాబాద్(12703), చెన్నై-హౌడా (12840) ఎక్స్‌ప్రెస్‌లు డిసెంబర్ 4, 8, 9, 10,11 తేదీల్లో నిర్ణీత సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఆ శాఖ జీఎం పరమేశ్వర్ తెలిపారు.

News December 4, 2025

కోనసీమ: 11 నెలల్లో 17 మందికి పాజిటివ్

image

ప్రమాదకరమైన ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర సూచించారు. కోనసీమ జిల్లాలో గత 11 నెలల్లో 177 మందిని పరీక్షించగా, 17 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. వారంతా కోలుకున్నారని తెలిపారు. నల్లిని పోలి ఉండే కీటకం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.

News December 4, 2025

నష్టపోయేది అమెరికా, యూరప్‌లే: జైశంకర్

image

వలస నిబంధనలను కఠినతరం చేస్తే US, యూరప్ తమ సొంత ప్రయోజనాలనే దెబ్బతీసుకునే ప్రమాదం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘ప్రతిభను ఉపయోగించుకోవడం పరస్పర ప్రయోజనానికి దోహదపడుతుంది. దీనిపై వారిని ఒప్పించడమే సమస్య. టాలెంట్ కలిగిన వారిని రానివ్వకపోతే నికరంగా నష్టపోయేది వాళ్లే’ అని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అవకాశాలను స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చని, ప్రభుత్వాలు వారిని అడ్డుకోలేవని చెప్పారు.