News March 20, 2025
ఎన్టీఆర్: ‘ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తాం’

విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో బుధవారం ప్రారంభమైన యూనిట్లో ఏడాదికి 4,800 బస్సులు ఉత్పత్తి చేస్తామని అశోక్ లేల్యాండ్ సంస్థ ట్వీట్ చేసింది. తమ సంస్థ చరిత్రలో మల్లవల్లి యూనిట్ ప్రారంభించడం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఇక్కడే తమ సంస్థ ఏర్పాటు చేసిన “నలంద”లో లెర్నింగ్ సెంటర్, అడ్వాన్స్డ్ సర్వీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలిందిస్తామని అశోక్ లేల్యాండ్ Xలో పోస్ట్ చేసింది.
Similar News
News November 28, 2025
కల్వకుర్తి: సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు.. ఇదీ ఆయన ప్రస్థానం

కల్వకుర్తి నియోజకవర్గంలోని చల్లంపల్లి గ్రామానికి చెందిన జైపాల్ యాదవ్ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి కొనసాగి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించారు. 1981 నుంచి 95 దాకా గ్రామ సర్పంచ్గా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత 1986లో టీడీపీలో చేరి 1995లో తలకొండపల్లి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రెండు పర్యాయాలు BRS ఎమ్మెల్యేగా గెలిచారు.
News November 28, 2025
ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.
News November 28, 2025
MDK: సమయం తక్కువ.. సోషల్ మీడియాపై మక్కువ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2 ఏళ్లుగా గ్రామాల్లో సర్పంచ్ లేకపోవడంతో పాలన కుంటుబడగా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినందున మళ్లీ పల్లెల్లో సందడి నెలకొంది. ఎన్నికల తేదీలు దగ్గర ఉండటంతో ప్రచారానికి సమయం లేక గ్రామాల్లో ఉండే ఆశావాహులు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గ్రూపులు క్రియేట్ చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో హామీలు ఇస్తున్నారు.


