News August 17, 2024

ఎన్టీఆర్: కోర్టుకు హాజరైన మాజీ మంత్రి దేవినేని ఉమ

image

2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసు విచారణ నిమిత్తం మహారాష్ట్రలోని బిలోలి కోర్టులో శనివారం మాజీ మంత్రి దేవినేని ఉమ హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనలో అప్పటి సీఎం చంద్రబాబు సహా 16 మందికి న్యాయస్థానం నోటీసులిచ్చిందని ఉమ తెలిపారు. నేడు జరిగిన విచారణకు తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, హనుమంత్ షిండేలతో కోర్టు విచారణకు హాజరయ్యామని ఉమ స్పష్టం చేశారు.

Similar News

News December 4, 2025

గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

image

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్‌లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

News December 4, 2025

కృష్ణా జిల్లా అమర గాయకుడు జయంతి నేడు

image

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా సంగీతాభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. 1922 డిసెంబర్ 4న కృష్ణా జిల్లా చౌటపల్లిలో జన్మించిన ఘంటసాల, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. అనేక భాషల్లో ఆయన ఆలపించిన గీతాలు నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. “చివరి శ్వాస వరకు గానం చేస్తాను” అన్న ఆయన మాటలు సంగీతాభిమానులను ముద్దుపెట్టుకుంటూనే ఉన్నాయి.

News December 3, 2025

కృష్ణా: డీసీసీ అధ్యక్షుల రేసులో అందె, శొంఠి

image

కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.