News February 4, 2025
ఎన్టీఆర్: క్రైమ్ పోలీసులకు రివార్డ్స్

NTR జిల్లాలో దొంగతనాల కేసులు తక్కువ సమయంలో చేదించిన పోలీసులకు నగదు రివార్డులతో ఎస్పీ రాజశేఖర్ బాబు అభినందించారు. సోమవారం విజయవాడలో విధి నిర్వహణలో విశేష ప్రతిభను కనబరిచిన పది మంది క్రైమ్ పోలీస్ అధికారులకు సిబ్బందికి నగదు వార్డులను అందించారు. నగదు రీవార్డ్ సాధించిన వారిలో స్వామి, సత్యనారాయణ,కృష్ణమూర్తి, ప్రకాష్ రావు, నాగరాజు, రవికుమార్, సురేష్, రమణ, షేక్ షబ్బీర్, శిరీష ఉన్నారు.
Similar News
News February 15, 2026
వాలీబాల్ లీగ్ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు ప్రథమ స్థానం

భట్టిప్రోలులో నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల వాలీబాల్ లీగ్ పోటీలు ఆదివారంతో ముగిసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కరీంశెట్టి సుబ్బారావు తెలిపారు. ఆదివారం భట్టిప్రోలు ప్రభుత్వ పాఠశాలలో సుబ్బారావు మాట్లాడారు. ఈ పోటీల్లో 8 టీములు పాల్గొన్నాయన్నారు. కృష్ణాజిల్లా 1వ స్థానం సాధించిందన్నారు. బాపట్ల జిల్లా-2, ప్రకాశం జిల్లా -3, ఎన్టీఆర్ జిల్లా -4వ స్థానంలో నిలిచాయన్నారు.
News February 15, 2026
జాబ్ క్రియేటర్లుగా డేటా సెంటర్లు: మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాకు INDలో ఆశ్రయం కల్పిస్తామని PM మోదీ ప్రకటించారు. డేటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయన్నారు. ‘కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్ ఇన్ఫ్రా సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. తద్వారా ఏఐ ఎకోసిస్టమ్కు పునాది వేస్తోంది. ఈ ఏడాది 7 ప్రధాన నగరాల్లోని డేటా సెంటర్ల సామర్థ్యం 1.7GW దాటుతుందని అంచనా’ అని పేర్కొన్నారు. కాగా రేపు ఢిల్లీలో <<19143850>>ఏఐ సమ్మిట్ను<<>> PM ప్రారంభించనున్నారు.
News February 15, 2026
ప్రభాస్కు గాయం!

సినీ హీరో ప్రభాస్ గాయపడినట్లు సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్లో హార్స్ రైడ్ చేస్తుండగా ఆయనకు గాయమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ షూటింగ్కు బ్రేక్ తీసుకున్నారని, రేపట్నుంచి మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కీలకదశలో ఉంది. అటు సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.


