News March 1, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పరీక్షకు 958 మంది గైర్హాజరు

శనివారం తొలిరోజు జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ పరీక్షకు 40,695 మందికి గాను 39,737 మంది హాజరయ్యారు. 958 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు పలు సిటింగ్ స్క్వాడ్ స్ విధుల్లో పాల్గొన్నాయి.
Similar News
News March 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 3, 2025
దుబాయ్ వెళ్లింది మ్యాచ్ కోసం కాదు: హరీశ్ రావు

TG: తాను దుబాయ్ వెళ్లింది క్రికెట్ మ్యాచ్ కోసం కాదని BRS నేత హరీశ్ రావు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూతురు పెళ్లి కోసం వెళ్లానని ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో ఉండి కూడా ఎస్ఎల్బీసీ బాధితులను సీఎం పరామర్శించలేదు. మానవత్వం మరచి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. విలాసాల్లో మునిగింది నేను కాదు.. సీఎం, మంత్రులే. నిఘా పెట్టాల్సింది మా మీద కాదు. ప్రజా ప్రయోజనాలపైనా’ అని పేర్కొన్నారు.
News March 3, 2025
జిల్లాలో మావోయిస్టు కదలికలు లేవు: ములుగు SP

ములుగు జిల్లాలో మావోయిస్టుల కదలికలు పూర్తిగా అంతరించిపోయాయని SP శబరిశ్ స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 ఏళ్ల తర్వాత ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గేట్లు తెరిచి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించామన్నారు. 2001లో పీపుల్స్ వార్ సభ్యులు ట్రాక్టర్లలో మందుపాతరలు అమర్చి స్టేషన్ పేల్చివేశారని, అయితే ప్రస్తుతం జిల్లాలో వారి కార్యకలాపాలు లేవన్నారు.