News January 26, 2025
ఎన్టీఆర్ జిల్లాలో నేడు ఆ రెండు బంద్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Similar News
News January 3, 2026
సిరిసిల్ల: నారుమడులపై చలి ఎఫెక్ట్.. ఆందోళనలో రైతులు

యాసంగి సాగుకు అధిక చలి, మంచుతో నారుమడులపై తీవ్ర ప్రభావం ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చలితో పాటు సూర్యరశ్మి లేకుండా దట్టమైన పొగ మంచు ఉండడంతో నారుమల్లు ఎదగడం లేదు. సిరిసిల్ల జిల్లాలోని అధిక గ్రామాల్లో నారుమల్లు పోసిన 25 రోజుల తర్వాత నాట్లు వేసేవారు. కానీ, 35 రోజులు దాటినా నాట్లు వేయలేని దుస్థితి నెలకొంది. నాట్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News January 3, 2026
సిరిసిల్ల : ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ రంగానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా గుర్తించిన విషయం తెలిసిందే.
News January 3, 2026
అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు.. ఖమ్మం, హైదరాబాద్లో సెంటర్లు!

జగిత్యాల జిల్లాలో టెట్ అభ్యర్థులకు సొంత జిల్లాలో కాకుండా ఖమ్మం, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో వేయడంతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండు సార్లు కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం కూడా సెంటర్ చాలా దూరం ఉండటంతో ముఖ్యంగా మహిళలు పరీక్షలకు గైర్హాజరు అవుతున్నారు. టెట్ ఫీజు 1000/- చెల్లించి అంత దూరం వెళ్లలేక మానుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో KNR, JGTL, PDPL సెంటర్లు ఉండగా అక్కడ వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.


