News March 17, 2025

ఎన్టీఆర్ జిల్లాలో 268 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ప్ర‌శాంతంగా సాగాయి. రిజిస్ట‌ర్ అయిన 27,711 మంది రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు గాను 27,443 మంది హాజ‌ర‌య్యారు. 44 మంది ప్రైవేటు విద్యార్థుల‌కు 39 మంది హాజ‌రైన‌ట్లు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. తాను 11 ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేశామన్నారు. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా అధికారులకు సూచ‌న‌లు చేసినట్లు పేర్కొన్నారు. 

Similar News

News March 18, 2025

నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

image

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

News March 18, 2025

వెదురుకుప్పం: మహేశ్ మృతదేహాన్ని అప్పగించాలంటూ నిరసన

image

వెదురుకుప్పం మండలంలోని కొమరగుంట గ్రామానికి చెందిన మహేశ్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. తాను నివసిస్తున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మహేశ్ మృత దేహాన్ని అప్పగించాలంటూ వెదురుకుప్పం -పచ్చికాపల్లం రహదారి మార్గంలో కొమరగుంట క్రాస్ రోడ్డులో మంగళవారం బంధువుల ఆందోళన చేపట్టారు. మహేశ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News March 18, 2025

HYD: దుకాణం.. అగ్ని ప్రమాదానికి ఆహ్వానం!

image

కిరాణా దుకాణాలు ప్రమాదపు బాంబులుగా మారాయి. అగ్ని ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఘట్‌కేసర్ మండల పరిధిలో షాపుల్లోనే అక్రమంగా పెట్రోల్ అమ్ముతున్నారు. పెట్రోలియం ఆక్ట్, 1934 ప్రకారం ఇది తీవ్ర నేరం. కఠిన శిక్షలు విధించాలి. కానీ, అధికారుల నిద్రమత్తుతో ఈ దందా బహిరంగంగా సాగుతోంది. చిన్న అగ్ని ప్రమాదమే పెను విషాదంగా మారనుంది. ఇప్పటికైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

error: Content is protected !!