News March 17, 2025
ఎన్టీఆర్ జిల్లాలో 268 మంది విద్యార్థులు గైర్హాజరు

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. రిజిస్టర్ అయిన 27,711 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 27,443 మంది హాజరయ్యారు. 44 మంది ప్రైవేటు విద్యార్థులకు 39 మంది హాజరైనట్లు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. తాను 11 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అధికారులకు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
JGTL: పెళ్లై నెల కాలేదు.. నవదంపతుల సూసైడ్..!

కూర విషయంలో తలెత్తిన గొడవ నవదంపతులను కన్నవారికి దూరం చేసింది. JGTLలో జరిగిందీ విషాదం. ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండివాసులు గంగోత్రి, సంతోశ్ SEPT 26న లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. దసరాకు అత్తింటికి వెళ్లిన సంతోశ్ భోజనం చేస్తుండగా మటన్ కూర బాలేదంటూ భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపంతో గంగోత్రి పండగరోజే సూసైడ్ చేసుకుంది. తట్టుకోలేకపోయిన సంతోశ్ నువ్వు లేని జీవితం నాకొద్దంటూ దీపావళి రోజు ఆత్మహత్య చేసుకున్నాడు.
News October 22, 2025
పాయకరావుపేట నియోజకర్గంలో పొలిటికల్ హీట్

పాయకరావుపేట నియోజకవర్గంలో నేడు పొలిటికల్ హీట్ నెలకోనుంది. ఛలో రాజయ్యపేటకు వైసీపీ పిలుపునివ్వగా, టీడీపీ ఆధ్వర్యంలో ఎస్.రాయవరం మండలం అడ్డరోడ్డులో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. దీంతో పోలీసుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రవీంద్ర, హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వస్తున్నారు. వైసీపీ ముఖ్య నాయకులు రాజయ్యపేట రానున్నారు.
News October 22, 2025
కొత్తపేట పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్

వేటపాలెం (M) కొత్తపేట పంచాయతీ ఎన్నికలకు మంగళవారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ పంచాయతీల పునర్విభజనపై 2021లో కొందరు కేసులు వేయడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టులో కేసులు తొలగిపోవడంతో అధికారులు ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్తపేటలో 16 వార్డులు ఉండగా సుమారు 11,500 ఓటర్లు ఉన్నారు. నవంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నారు.