News March 17, 2025

ఎన్టీఆర్ జిల్లాలో 268 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షలు ప్ర‌శాంతంగా సాగాయి. రిజిస్ట‌ర్ అయిన 27,711 మంది రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు గాను 27,443 మంది హాజ‌ర‌య్యారు. 44 మంది ప్రైవేటు విద్యార్థుల‌కు 39 మంది హాజ‌రైన‌ట్లు డీఈఓ యూవీ సుబ్బారావు తెలిపారు. తాను 11 ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేశామన్నారు. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు ఆస్కారం లేకుండా అధికారులకు సూచ‌న‌లు చేసినట్లు పేర్కొన్నారు. 

Similar News

News July 6, 2025

కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

image

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.

News July 6, 2025

పార్వతీపురం: జిల్లాకు వచ్చిన నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్

image

అశావాహ జిల్లాగా గుర్తించిన పార్వతీపురం మన్యం జిల్లాకు నీతి అయోగ్ అడిషనల్ మిషన్ డైరెక్టర్‌ మహేంద్ర కుమార్ శనివారం వచ్చారు. కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి సత్కరించారు. జిల్లాలో అశావాహ జిల్లాగా చేపట్టిన కార్యక్రమాల గురించి కలెక్టర్ వివరించారు.

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్స్&టీచర్స్ సమావేశం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 10న మెగా పేరెంట్&టీచర్స్ సమావేశంపై శనివారం సాయంత్రం కలెక్టర్ శ్యాం ప్రసాద్ వివరించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల కమిటీలు, పదోతరగతిలో ఉత్తమ ర్యాంకర్‌లు, పూర్వ విద్యార్థులు, తదితరులతో కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కార్యాచరణ చేస్తోందని వెల్లడించారు. అంతా తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.