News December 8, 2024
ఎన్టీఆర్ జిల్లా: పురుగుల మందు తాగి యువతి సూసైడ్
పురుగుల మందు తాగి యువతి మృతి చెందిన ఘటన జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో జరిగింది. గోళ్ల గోపాలరావు, నాగమణి దంపతుల కుమార్తె భాగ్యలక్ష్మి(17) కొన్నాళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తట్టుకోలేక పురుగుల మందు తాగింది. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు.
Similar News
News January 18, 2025
కలిదిండి: మాజీ సర్పంచ్ది ప్రమాదం కాదు.. హత్య
కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్యది ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధన శీను పథకం ప్రకారం గురువారం సాయంత్రం దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.
News January 18, 2025
కృష్ణా, NTR జిల్లాలపై చంద్రబాబు సంతృప్తి
సీఎం చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జుల మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురి మంత్రులను హెచ్చరించారు.
News January 18, 2025
కృష్ణా: ప్రయాణికుల కోసం ప్రత్యేక రైలు
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- చర్లపల్లి(CHZ) మధ్య శనివారం ప్రత్యేక రైలును అధికారులు నడుపుతున్నారు. ఈ మేరకు రైలు నం.08549 VSKP- CHZ రైలును శనివారం నడుపుతామన్నారు. ఈ రైళ్లలో 4 జనరల్ కోచ్లు, 9 స్లీపర్ కోచ్లు ఉంటాయని తెలిపారు. ఈ రైలు మధ్యాహ్నం 2.55 కి విజయవాడ, రాత్రి 9 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని వివరించారు.