News March 16, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు అలెర్ట్

జిల్లాలో నేడు 9 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయవాడ అర్బన్ & రూరల్ 40.7, వీరులపాడు 41.2, పెనుగంచిప్రోలు 41.3, నందిగామ 41.4, జి.కొండూరు 40.7, చందర్లపాడు 41.4, ఇబ్రహీంపట్నం 41, కంచికచర్ల 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందన్నారు.
Similar News
News December 5, 2025
మొదటి విడత.. 461 సర్పంచ్, 1,954 వార్డు స్థానాలకు పోటీ

జగిత్యాల జిల్లాలో ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 7 మండలాల్లోని మొత్తం 122 సర్పంచ్, 1,172 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 122 సర్పంచి స్థానాలకు గాను మొత్తం 461 మంది, అలాగే 1,172 వార్డు స్థానాలకు గాను మొత్తం 1,954 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
News December 5, 2025
కామారెడ్డిలో పర్యటించిన బీజేపీ జిల్లా ఇన్ఛార్జి

కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ జిల్లా ఇన్ఛార్జి విక్రమ్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఆయనకు జిల్లాలో బీజేపీ సంస్థాగత వివరాలను వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై, నాయకత్వం గురించి తెలిపారు. BJP సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, పైడి ఎల్లారెడ్డి, హైమారెడ్డి, BJP నాయకులు పాల్గొన్నారు.
News December 5, 2025
PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.


