News March 28, 2025
ఎన్టీఆర్ జిల్లా ప్రజలు జాగ్రత్త

జిల్లాలో నేడు పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. వడగాలులకు గురవ్వకుండా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ మేరకు తమ X ఖాతా ద్వారా ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. చందర్లపాడు 43.3, గంపలగూడెం 42.3, మైలవరం 43.1, నందిగామ 43.4, రెడ్డిగూడెం 42.2, వీరులపాడు 43.7, విస్సన్నపేట 41.6, విజయవాడ అర్బన్ & రూరల్ 42.5
Similar News
News December 3, 2025
KNR: CM మీటింగ్కు 144 RTC బస్సులు.. తిప్పలు..!

హుస్నాబాద్లో తలపెట్టిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కరీంనగర్ రీజియన్ పరిధిలో ఐదు డిపోల నుంచి 144 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు. వీటిల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలను తరలించనున్నారు. ఇదిలాఉండగా నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికోసం అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఉన్న అరకొర బస్సులను సీఎం మీటింగ్కు అలాట్ చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పేలాలేవు.
News December 3, 2025
కాకినాడ: చాపకింద నీరులా ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి

కాకినాడ జిల్లాలో 148 ‘స్క్రబ్ టైఫస్’ పాజిటివ్ కేసులు నమోదైనట్లు DMHO నరసింహ నాయక్ తెలిపారు. కాకినాడ అర్బన్లో 58, కాకినాడ రూరల్ 17, పెద్దాపురం 15, సామర్లకోట 11, తొండంగి 6, ప్రత్తిపాడు 5, తాళ్లరేవు 5, గొల్లప్రోలు 4, కిర్లంపూడి 4, యు.కొత్తపల్లి 4, కరప 4, కాజులూరు 3, రౌతులపూడి 3, జగ్గంపేట 2, పిఠాపురం 2, శంఖవరం 2, తుని 1, ఏలేశ్వరం 1, గండేపల్లి 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.
News December 3, 2025
₹274 కోట్లు దోచి పరారైన డోన్ రియల్టర్!

డోన్కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని ప్రముఖుల నుంచి ₹274 కోట్లు అప్పులు, పెట్టుబడుల రూపంలో వసూలు చేసి అమెరికా పరారయ్యాడు. చిరుద్యోగి అయిన అతడు స్థిరాస్తి వ్యాపారంలోకి దిగి బెంగళూరులో ఆఫీస్ ప్రారంభించాడు. సొంత డబ్బుతో విదేశీ యాత్రలు, పార్టీలు ఇస్తూ ప్రముఖులకు దగ్గరై భారీగా డబ్బులు వసూలు చేశాడు. కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో బాధితులు బయటకు చెప్పలేక కుమిలిపోతున్నారు.


