News March 19, 2025
ఎన్టీఆర్ జిల్లా TODAY TOP NEWS

*విజయవాడ: స్నానానికి వెళ్లి బాలుడు మృతి. * పెనుగంచిప్రోలు: పోలీసులపై దాడి కేసు నమోదు. * బ్యాడ్మింటన్ ఆట సరిగ్గా ఆడలేదని కోచ్ దాడి. * పెనుగంచిప్రోలు: ఎగ్జిబిషన్లో ప్రమాదం.. వ్యక్తి మృతి. *విజయవాడ: మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత బుద్ధ ఫైర్. *విజయవాడలో సందడి చేసిన కోర్ట్ సినిమా యూనిట్. * విజయవాడ: దోమల నివారణకు చర్యలు.
Similar News
News December 24, 2025
‘VB-G RAM G’పై ప్రభుత్వ అడుగు ఎటు?

TG: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం ‘VB-G RAM G’గా మార్చింది. దీనిని INC అధినేత్రి సోనియా, విపక్ష నేతలు వ్యతిరేకించారు. WB CM మమత తమ రాష్ట్ర ఉపాధి పథకానికి గాంధీ పేరు పెడతామని ప్రకటించారు. కర్ణాటక, కేరళ GOVTలు నిరసనకు దిగాయి. కేంద్ర చర్యను వ్యతిరేకించాలని రాష్ట్రంలోనూ డిమాండ్లున్నాయి. త్వరలో అసెంబ్లీ సమావేశాలున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ సాగుతోంది.
News December 24, 2025
ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం: మంత్రి నిమ్మల

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. క్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి, ఐక్యత వంటి విలువలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని పేర్కొన్నారు. ఈ వేడుకలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందించి, ఐక్యతను మరింత బలపరచాలని ఆయన ఆకాంక్షించారు.
News December 24, 2025
రాస్కోండి.. 29లో 2/3 మెజార్టీ పక్కా: రేవంత్

TG: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2/3 మెజార్టీతో గెలుస్తుందని CM రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ‘2029లో 119 సీట్లే ఉంటే 80కి పైగా సాధిస్తాం. ఒకవేళ 150 (నియోజకవర్గాల పునర్విభజన) అయితే 100కు పైగా గెలుస్తాం’ అని కోస్గిలో ప్రకటించారు. ‘చంద్రశేఖర్ రావు, హరీశ్ రావు, దయాకర్ రావు సహా BRS రావులంతా ఇది రాసి పెట్టుకోండి’ అని ఛాలెంజ్ విసిరారు. తాను ఉన్నంత వరకూ BRSను అధికారంలోకి రానివ్వనని స్పష్టం చేశారు.


