News January 30, 2025

ఎన్టీఆర్: డిగ్రీ (డిస్టెన్స్) పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో 2024 అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయ్యద్ జైనులబ్ధీన్ తెలిపారు. బీఏ, బీకామ్(జనరల్&కంప్యూటర్స్) 1,2,3వ సెమిస్టర్ పరీక్షల రెగ్యులర్&సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామని, http://anucde.info/‌లో చూడాలన్నారు. రీవాల్యుయేషన్‌కై అభ్యర్థులు ఫిబ్రవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 18, 2025

SRD: ‘రాజీతో ఇరు వర్గాలు గెలుపొందినట్లే’

image

క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకోవడానికి ఈనెల 21న అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుందన్నారు.

News December 18, 2025

రేగొండ: డబుల్ మర్డర్ కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష

image

రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డబుల్ మర్డర్ కేసులో ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కంచరకుంట్ల రాజు @ రాజిరెడ్డి(45)ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, అతడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.1,000 జరిమానా విధించింది. ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.

News December 18, 2025

పలమనేరు: రూ.40 కోట్ల భూమి కబ్జా.?

image

పలమనేరు నియోజకవర్గంలో మరో భారీ భూ స్కాం ఇది. గంగవరంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసినట్లు తెలుస్తోంది. చెన్నై-బెంగళూరు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న వంక పోరంబోకు భూమిపై అధికారికంగా నిషేధం ఉన్నప్పటికీ, దానిని ప్రైవేట్ భూమిగా మార్చినట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.40 కోట్లుగా ఉంటుందట. దీనిపై మరింత సమాచారం తెలియాలి.