News January 30, 2025
ఎన్టీఆర్: డిగ్రీ (డిస్టెన్స్) పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో 2024 అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేశామని పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయ్యద్ జైనులబ్ధీన్ తెలిపారు. బీఏ, బీకామ్(జనరల్&కంప్యూటర్స్) 1,2,3వ సెమిస్టర్ పరీక్షల రెగ్యులర్&సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామని, http://anucde.info/లో చూడాలన్నారు. రీవాల్యుయేషన్కై అభ్యర్థులు ఫిబ్రవరి 11లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News December 17, 2025
వరంగల్ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా..!

జిల్లా వ్యాప్తంగా మూడో విడత సర్పంచి ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా నమోదైంది. నర్సంపేట మండలంలో 57.62 శాతం, ఖానాపురం మండలంలో 44.88 శాతం పోలింగ్ జరిగింది. చెన్నారావుపేట మండలంలో 64.86 శాతం, నెక్కొండ మండలంలో 63.3 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుండగా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News December 17, 2025
ములుగు: 11 గంటల వరకు 60.64% పోలింగ్ నమోదు

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఉదయం 11 గంటల వరకు 60.64% ఓట్లు పోలయ్యాయి. కన్నాయిగూడెం మండలంలో 64.91%, వెంకటాపురం మండలంలో 60.10%, వాజేడు మండలంలో 59.35% పోలింగ్ నమోదయింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. కలెక్టర్, ఎన్నికల అబ్జర్వర్ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
News December 17, 2025
11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.


