News January 29, 2025

ఎన్టీఆర్: డిగ్రీ వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(Y15 నుంచి Y17 బ్యాచ్‌లు) 4వ సెమిస్టర్ వన్ టైం ఆపర్చ్యూనిటీ థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 20లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు మార్చి 25 నుండి నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.

Similar News

News February 28, 2026

భారత్ vs వెస్టిండీస్.. రేపు వర్షం పడుతుందా?

image

రేపు కోల్‌కతాలో భారత్-వెస్టిండీస్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీఫైనల్‌లో అడుగుపెట్టనుంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే తక్కువ నెట్ రన్‌రేట్ ఉన్న IND టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో రేపు కోల్‌కతాలో వర్షం పడే ఛాన్సుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే వర్షం ముప్పు లేదని వాతావరణ అధికారులు చెప్పారు. ఆకాశం క్లియర్‌గా ఉందని, ఎలాంటి మబ్బులు లేవని పేర్కొన్నారు.

News February 28, 2026

ఆదిలాబాద్: ఎడ్లబండి కట్టు.. తాగునీరు పట్టు

image

ఇచ్చోడ మండలంలోని ముఖరా(బి) గ్రామంలో నాలుగు రోజులుగా మిషన్ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తాగునీటి కోసం గ్రామస్థులు ఎడ్లబండ్లు కట్టుకుని శివారులోని వ్యవసాయ బోరుబావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మాజీ సర్పంచ్ మారుతి, గ్రామస్థులు కోరుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఈ పరిస్థితి ఉండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 28, 2026

JNTUH ప్రొఫెసర్ల ప్రమోషన్లలో స్పష్టత లేదు

image

జేఎన్టీయూ ప్రొఫెసర్లకు CAS ప్రమోషన్ల విషయంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో నిర్వహించిన ఈసీ మీటింగ్‌లో ఈ ప్రమోషన్లు విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి JNTUH అధికారులు తీసుకొని రాగా ఆ ఫైలు ముందుకు కదల్లేదు. శుక్రవారం సైతం నిర్వహించిన మీటింగ్‌లో దీనిపైనా స్పష్టత రాలేదు. గత డిసెంబర్ ప్రొఫెసర్లకు ఇంటర్వ్యూ చేపట్టారు. ఇది ఇలానే కొనసాగితే గడువు ముగిసి మరోసారి ఇంటర్వ్యూలు చేపట్టాల్సి వస్తుంది.