News February 3, 2025

ఎన్టీఆర్: డిగ్రీ 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ రెగ్యులర్‌ & సప్లిమెంటరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలయింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఫిబ్రవరి 20లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఈ పరీక్షలు మార్చి 25 నుంచి నిర్వహిస్తామని, పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU వర్గాలు తెలిపాయి.

Similar News

News September 18, 2025

జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్‌.. అర్థమదేనా?

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్‌లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?

News September 18, 2025

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష: ఆసిఫాబాద్ SP

image

మైనర్ బాలికను అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి పోక్సో కేసు కింద 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.20 వేలు జరిమానాను కోర్టు విధించినట్లు ఆసిఫాబాద్ జిల్లా SP కాంతిలాల్ పాటిల్ ఈరోజు తెలిపారు. ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక(8)పై 2023 డిసెంబర్ 10న అదే ప్రాంతానికి చెందిన M.రామేశ్వర్(23) లైంగిక దాడి చేశాడన్నారు. జైనూర్ PSకు అందిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేయగా నేరం రుజువు కావడంతో శిక్ష పడిందన్నారు.

News September 18, 2025

అంగన్వాడీలకు పూర్తి భద్రత: మంత్రి సంధ్యారాణి

image

అంగన్వాడీలకు ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తుందని శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జిల్లా మంత్రి సంధ్యారాణి క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబందించి గురువారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 55,746 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయన్నారు. అలాగే వారికి టీడీపీ ప్రభుత్వమే గౌరవ వేతనం పెంచిందన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్లకు 180 ప్రసూతి సెలవులు,20 రోజుల వార్షిక సెలవులు మంజూరు చేయడం జరిగిందన్నారు.