News March 12, 2025

ఎన్టీఆర్: నేడు ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

image

ఎన్టీఆర్ జిల్లాలో బుధవారం కింది మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఈ మేరకు తమ అధికారిక X ఖాతా ద్వారా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.చందర్లపాడు 40.2, జి.కొండూరు 39.9, ఇబ్రహీంపట్నం 41, కంచికచర్ల 40.2, విజయవాడ రూరల్ 40.3, విజయవాడ అర్బన్ 40.2. 

Similar News

News February 12, 2026

నార్త్ కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జు ఏ?

image

ఉత్తర కొరియా తదుపరి లీడర్‌గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News February 12, 2026

డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది డుమ్మా

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ములుగు(మం) రాంచంద్రాపురం, పందికుంట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాంచంద్రపురం సబ్ సెంటర్ లో సిబ్బంది ఎవ్వరూ విధుల్లో లేరు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మెమోలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సమయపాలన పాటించకున్నా, ప్రజలకు అందుబాటులో లేకున్నా చర్యలు తప్పవన్నారు. తర్వాత పందికుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

News February 12, 2026

మంచిర్యాల: స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

image

బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూములను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.