News March 9, 2025

ఎన్టీఆర్: నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ అధిష్ఠానం అభ్యర్థులను దాదాపు ఖరారు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నుంచి నుంచి వెంకన్న, దేవినేని ఉమా, వంగవీటి రాధా నెట్టెం రఘురాం ఆశావహుల్లో ఉన్నారు. వీరిలో ఎవరిక దక్కుతుందోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆదివారం రాత్రిలోగా అధికారికంగా అభ్యర్థుల ప్రకటన వెలువడనన్నట్లు చెబుతున్నారు.

Similar News

News November 24, 2025

ఖమ్మం: విశ్వామిత్ర చౌహాన్‌కు వరల్డ్ రికార్డు

image

ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహాన్ ‘విశ్వ గురు వరల్డ్ రికార్డు’ను అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో హీరోయిన్ కుమారి శ్రీలు, ఇంటెలిజెన్స్ ఏసీపీ రాజీవ్ రెడ్డి, నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా చౌహాన్ ఈ ప్రతిష్ఠాత్మక రికార్డును స్వీకరించారు. అతిథులు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు

News November 24, 2025

నెలకు రూ.25 వేలతో ఉద్యోగాలు

image

ధర్మవరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఈనెల 26న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తరగతి నుంచి పీజీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులన్నారు. నెలకు రూ.15,000 నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు.

News November 24, 2025

రాష్ట్ర బ్యాంకుల్లో రూ.2,200 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్

image

TG: రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లోని 80 లక్షల ఖాతాల్లో రూ.2,200 కోట్ల అన్‌క్లెయిమ్డ్ సొమ్ము ఉన్నట్లు RBIకి సమర్పించిన నివేదికలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. SBIలోనే దాదాపు 21.62 లక్షల అకౌంట్లలో సుమారు రూ.590Cr ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ నిధులను ఖాతాదారులు లేదా వారి వారసులకు అందజేసేందుకు బ్యాంకులు ఈ ఏడాది DEC 31 వరకు ‘వారసుల వేట’ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి.