News March 30, 2025
ఎన్టీఆర్: పీజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన MSC, MBA, MCA 1, 3వ సెమిస్టర్(2024 -25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
Similar News
News November 16, 2025
కామారెడ్డి: చికెన్, మటన్ ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాటు వివిధ మండలాల్లో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. మటన్ కిలో రూ.800, ఉండగా చికెన్ స్కిన్ రూ.210 -220, స్కిన్ లెస్ రూ.230-240, లైవ్ కోడి రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం ధరలే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో విక్రయాలు సాధారణంగా ఉన్నాయని దుకాణాలు తెలిపారు.
News November 16, 2025
గద్వాల్ స్టేషన్లో ఆగే రైళ్లు ఇవే..!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT
News November 16, 2025
రేపు తిరుచానూరుకు రాష్ట్ర మంత్రి రాక..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 17వ తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 3 నుంచి 5 గంటల వరకు తిరుచానూరుకు చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.


