News March 30, 2025
ఎన్టీఆర్: పీజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో DEC 2024లో నిర్వహించిన MSC, MBA, MCA 1, 3వ సెమిస్టర్(2024 -25 విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని KRU పరీక్షల విభాగం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
Similar News
News September 16, 2025
మెట్రోతో నష్టాలు.. వాటాలను అమ్మేస్తాం: L&T

TG: హైదరాబాద్ మెట్రోతో తీవ్రంగా నష్టపోయామని, తమ వాటాలను విక్రయించేందుకు రెడీగా ఉన్నామని ఎల్ అండ్ టీ ప్రకటించింది. కొనుగోలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గిందని, నికర నష్టం రూ.626 కోట్లకు చేరిందని పేర్కొంది. దీంతో మెట్రో విస్తరణలో పాల్గొనలేమని ప్రకటించింది. కాగా వర్క్ ఫ్రం హోం, ట్రావెల్ కల్చర్లో మార్పులు వంటి కారణాలతో మెట్రో ప్రయాణికులు తగ్గినట్లు సమాచారం.
News September 16, 2025
వివిధ సంస్థలు- వ్యవస్థాపకులు

* మైక్రోసాఫ్ట్- బిల్గేట్స్, పాల్ అలెన్
*యాపిల్-స్టీవ్జాబ్స్, వోజ్నియాక్, రోనాల్డ్ వెయిన్
*యాహూ -జెర్రీ యాంగ్, డేవిడ్ ఫిలో
*గూగుల్ -లారీపేజ్, సెర్గీబ్రిన్
*లింక్డ్ ఇన్- రోడ్ హాఫ్మన్, ఎరిక్లీ, అలెన్ బ్లూ
*ఫేస్బుక్- మార్క్ జుకర్బర్గ్
*యూట్యూబ్- చాడ్ హర్లీ, స్టీవ్చెన్, జావెద్ కరీం
*ట్విటర్-జాక్ డార్సీ, నోగ్లాస్, బిజ్స్టోన్, ఇవాన్ విలియమ్స్
*వాట్సాప్- జాన్ కౌమ్, ఆక్టన్
News September 16, 2025
గుంటూరు: మెగా డీఎస్సీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

మెగా డీఎస్సీకి సంబంధించి తుది ఎంపిక జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1140 మంది అభ్యర్థులను విద్యాశాఖ ఎంపిక చేసింది. రిజర్వేషన్ల కారణంగా ఖాళీగా మిగిలిన 19 పోస్టులను తర్వాత భర్తీ చేస్తారు. ఈనెల 19న అమరావతిలో జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారికి నియామకపత్రాలు అందిస్తారు. శిక్షణ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలు కేటాయిస్తామని అధికారులు తెలిపారు.