News April 9, 2025
ఎన్టీఆర్: పీ4 సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఎన్టీఆర్: పీ4 అమలుపై సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ విధానాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ‘మార్గదర్శి’లను గుర్తించాలన్నారు. ఈ విధానం అమలుకు ముఖ్యమంత్రి ఛైర్మన్గా స్టేట్ లెవెల్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
Similar News
News November 22, 2025
బోయినిపల్లి: ‘బాల్యంలోనే TARGET ఫిక్స్ చేసుకోవాలి’

విద్యార్థులు బాల్యంలోనే లక్ష్యాన్ని ఎంచుకోని దాని సాధనకు కృషి చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలోని KGBVని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6, 9వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులందరూ చదువుపై శ్రద్ధ పెట్టాలన్నారు. తాము కోరుకున్న ఉద్యోగాలు, ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.
News November 22, 2025
చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

GDనెల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. RTC బస్సు-బైకు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు వివరాలు మేరకు.. బైకుపై ముగ్గురు GDనెల్లూరు నుంచి ఎట్టేరికి వెళుతుండగా మోతరంగనపల్లి వద్ద బస్సు-బైకు ఢీకొన్నాయి. బైకుపై ఉన్న ఇద్దరు స్పాట్లో చనిపోయారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2025
మదనపల్లెను భయపెట్టిన 1876 కరవు

మదనపల్లెను 1876లో భయంకరమైన కరవు భయపెట్టింది. ఈ ఏరియా రెండేళ్ల పాటు అతలాకుతలమైంది. ఆ సమయంలో చుక్క వర్షం పడలేదు. ఆ సమయంలో ఇండియా మొత్తం ఐదున్నర మిలియన్ల మంది చనిపోయినట్లు బ్రిటీషర్ల అంచనా. మదనపల్లె ఎక్కువగా ప్రభావితమైంది. మదనపల్లెకు 2మైళ్ల దూరంలోని అంగళ్లు రోడ్డులో సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో గంజి ఫ్రీగా ఇచ్చి పేదల ప్రాణాలు నిలిపారు.


