News March 29, 2025

ఎన్టీఆర్: పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారిన ఆ నేత

image

సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వంశీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ కేసులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం అట్రాసిటీ కేసుల కోర్టు తిరస్కరించింది. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID కోర్టు.. వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో వంశీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారారు. 

Similar News

News November 21, 2025

భూపాలపల్లి: మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో సమావేశం

image

భూపాలపల్లిలో మెడికల్ ఆఫీసర్లతో డీఎంహెచ్‌వో మధుసూదహన్ ఈరోజు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు వేసెక్టమీ క్యాంపు & మొబలైజేషన్‌కు సంబంధించిన విషయాలన్నీ ప్రజలకు తెలిపాలన్నారు. అత్యధికంగా ఎంఎస్సీ ఆపరేషన్లు అయ్యేటట్టు పురుషులను మోటివేషన్ చేయాలని తెలియజేశారు.  

News November 21, 2025

కడప కలెక్టరేట్‌లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

image

కడప కలెక్టరేట్‌లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్‌ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

News November 21, 2025

భూపాలపల్లి: గ్రామాల్లో మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీ

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లోని గ్రామాలకు మీ సేవ కేంద్రాలకు నోటిఫికేషన్ జారీచేస్తూ కలెక్టర్ నుంచి ప్రకటన వెల్లడించారు. ఆసక్తి కలిగిన దరఖాస్తుదారులు స్థానికులై అదే మండలానికి చెందినవారై ఉండాలని, కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు కలిగి ఉండాలన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తులను తహశీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రాత పరీక్ష & ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు.