News March 29, 2025
ఎన్టీఆర్: పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారిన ఆ నేత

సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వంశీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఈ కేసులో వంశీ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం అట్రాసిటీ కేసుల కోర్టు తిరస్కరించింది. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID కోర్టు.. వంశీ రిమాండ్ను ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో వంశీ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారారు.
Similar News
News November 18, 2025
INTRESTING: కృష్ణాంగారక చతుర్దశి కథ

పూర్వం అవంతీ నగరంలో భరద్వాజ మహర్షికి అప్సరసపై మోహం కలగగా, వీర్యం భూమిపై పడింది. దీంతో ఎర్రటి కుసుమం వంటి బాలుడు జన్మించాడు. అతడే అంగారకుడు. అతణ్ని భూదేవి పెంచింది. భరద్వాజుడు ఉపనయనం చేసి, గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. అంగారకుడు ఓనాడు నర్మదా తీరాన నిష్ఠగా జపించగా, గణపతి సాక్షాత్కరించాడు. అప్పుడు అంగారకుడు తన పేరుతో ఓరోజు మంగళకరం కావాలని, ఆ రోజున గణపతిని పూజిస్తే కష్టాలు తొలగిపోవాలని వరం కోరాడు.
News November 18, 2025
INTRESTING: కృష్ణాంగారక చతుర్దశి కథ

పూర్వం అవంతీ నగరంలో భరద్వాజ మహర్షికి అప్సరసపై మోహం కలగగా, వీర్యం భూమిపై పడింది. దీంతో ఎర్రటి కుసుమం వంటి బాలుడు జన్మించాడు. అతడే అంగారకుడు. అతణ్ని భూదేవి పెంచింది. భరద్వాజుడు ఉపనయనం చేసి, గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. అంగారకుడు ఓనాడు నర్మదా తీరాన నిష్ఠగా జపించగా, గణపతి సాక్షాత్కరించాడు. అప్పుడు అంగారకుడు తన పేరుతో ఓరోజు మంగళకరం కావాలని, ఆ రోజున గణపతిని పూజిస్తే కష్టాలు తొలగిపోవాలని వరం కోరాడు.
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్లోనూ పాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.


