News March 29, 2025

ఎన్టీఆర్: పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారిన ఆ నేత

image

సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వంశీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ కేసులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం అట్రాసిటీ కేసుల కోర్టు తిరస్కరించింది. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID కోర్టు.. వంశీ రిమాండ్‌ను ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో వంశీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారారు. 

Similar News

News December 9, 2025

HYD: GHMCలో 300 వార్డులు.. మీకు అబ్జెక్షన్ ఉంటే చెప్పండి.!

image

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) పరిధిని 300 ఎన్నికల వార్డులుగా విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనలు, 1996 ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. వార్డుల సరిహద్దుల వివరాలు www.ghmc.gov.in వెబ్‌సైట్‌తో పాటు అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 7రోజుల్లోపు అభ్యంతరాలు, సూచనలు దాఖలు చేయాలని కమిషనర్ కోరారు.

News December 9, 2025

MNCL: ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

image

ఈ నెల 11న జరగనున్న మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజు తీసుకోవలసిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉపసర్పంచ్ ఎన్నిక, ప్రవర్తన నియమావళి అమలు, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సూచనలు చేశారు.

News December 9, 2025

తిరుపతి జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి

image

తిరుపతి(D) నారాయణవనం మండలంలో విషాద ఘటన జరిగింది. నగరి(ఛ) గుండ్రాజుకుప్పానికి చెందిన గుణశేఖర్(42) తిరువట్యంలో జరిగిన బంధువుల దహనక్రియలకు హాజరయ్యారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా తిరువట్యం కాజ్‌వే వద్ద నారాయణవనం రజక కాలనీకి చెందిన అంకమ్మ(72) బట్టలు ఉతుకుతూ నదిలో పడిపోవడాన్ని ఆయన గుర్తించారు. ఆమెను కాపాడడానికి గుణశేఖర్ నదిలోకి దూకారు. ఈత రాకపోవడంతో వృద్ధురాలితో పాటు అతనూ నీట మునిగి చనిపోయారు.