News March 29, 2025
ఎన్టీఆర్: పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారిన ఆ నేత

సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వంశీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఈ కేసులో వంశీ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం అట్రాసిటీ కేసుల కోర్టు తిరస్కరించింది. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో CID కోర్టు.. వంశీ రిమాండ్ను ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. దీంతో వంశీ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారారు.
Similar News
News November 27, 2025
WTC ఫైనల్.. భారత్ చేరుకోవడం కష్టమే!

SAతో టెస్టు సిరీస్లో ఓటమితో.. భారత్కి 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుతం 48.15%తో ఐదో స్థానంలో ఉన్న టీమ్ఇండియా.. మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 6 విజయాలు, 2 డ్రాలు లేదా ఏడు విజయాలు సాధించాలి. ఫైనల్కు చేరుకోవాలంటే కనీసం 60% పాయింట్లు అవసరం. శ్రీలంక, న్యూజిలాండ్ విదేశీ టూర్లతో పాటు, ఆస్ట్రేలియాతో 5 హోం టెస్టులు భారత్కు కఠిన సవాల్గా మారనున్నాయి.
News November 27, 2025
విజయవాడ: స్నానానికి వెళ్లి తండ్రీకొడుకులు మృతి..!

కృష్ణానది సీతమ్మవారి పాదాల సమీపంలో మంగళవారం <<18383728>>ఇద్దరి మృతదేహలు<<>> లభ్యమైన విషయం తెలిసిందే. వీరిని తండ్రీకొడుకులుగా గుర్తించినట్లు కృష్ణలంక సీఐ నాగరాజు తెలిపారు. ఈ నెల 25న నదిలో లభించిన మృతదేహాలను తాడేపల్లికి చెందిన కరుణాకర్, అతని కుమారుడు భగవాన్గా గుర్తించారు. కుటుంబ సభ్యులతో నది వద్దకు వచ్చి, స్నానానికి లోపలికి వెళ్లడంతో మునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 27, 2025
రూ.89కే X ప్రీమియం ఆఫర్

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని X.. ప్రీమియం సేవలను కేవలం రూ.89కే అందిస్తూ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. Grok AI, బ్లూ టిక్ మార్క్, తక్కువ యాడ్స్, రీచ్ ఎక్కువ, క్రియేటర్ మానిటైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. డిసెంబర్ 2 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ప్రీమియం రూ.89కి, ప్రీమియం+ ప్లాన్ను రూ.890కి పొందే అవకాశం ఉంది. మొదటి నెల తర్వాత ధరలు మళ్లీ రూ.427 (Premium), రూ.2,570 (Premium+)కి మారుతాయి.


