News April 23, 2025
ఎన్టీఆర్: ప్రధాని మోదీ పర్యటనకు 120 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాట్లు

మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా CRDA అధికారులు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. సెక్రటేరియట్ సమీపంలో సభ జరిగే ప్రాంగణాన్ని 28 ఎకరాల్లో అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్టేజి వెనుక 10 ఎకరాలు, సమీపంలో 32 ఎకరాలలో VIPల వాహనాల పార్కింగ్కు స్థలం చదును చేసి సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలు తరలి వచ్చే బస్సులకు 110 ఎకరాలలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
Similar News
News April 24, 2025
సర్జికల్ స్ట్రైక్స్ వార్తలు.. పాక్ సరిహద్దు గ్రామాలు ఖాళీ?

J&K పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్లో గుబులు మొదలైంది. ISI హెచ్చరికలతో ముందుజాగ్రత్తగా సరిహద్దు గ్రామాలను ఆర్మీ ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఎయిర్ఫోర్స్ కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఉరి దాడికి కౌంటర్గా 2016లో POK, పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో బాలాకోట్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయం తెలిసిందే.
News April 24, 2025
సింగరేణి.. వారికి 50% జీతంతో స్పెషల్ లీవ్స్

TG: తీవ్ర కాలేయ వ్యాధి(లివర్ సిరోసిస్) బారిన పడిన కార్మికులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 50 శాతం వేతనంతో కూడి ప్రత్యేక సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వారు కోలుకునే వరకు ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు గుండె జబ్బు, టీబీ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, ఎయిడ్స్, మూత్రకోశ, మెదడు వ్యాధులకు ఇలాంటి సదుపాయం ఉండగా కాలేయ వ్యాధులకూ విస్తరించారు.
News April 24, 2025
ఏ సబ్జెక్టులో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే!

కర్నూలు జిల్లాలో 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,601 మంది ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో 2,598 మంది, హిందీలో 292, ఇంగ్లీష్లో 4,660, మ్యాథ్స్ 7,781, సైన్స్ 6,900, సోషల్లో 4,497 మంది ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగులో 91 మంది, హిందీలో 15, ఇంగ్లీష్లో 1, మ్యాథ్స్ 22, సైన్స్ 21, సోషల్లో 15 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.