News February 5, 2025

ఎన్టీఆర్: ఫైనాన్షియల్ కమిటీలో ఎంపికైన జిల్లా నేతలు వీరే

image

రాష్ట్ర శాసనసభ వ్యవస్థలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ స్పీకర్ అయన్నపాత్రుడు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కమిటీలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య, MLC మొండితోక అరుణ్(నందిగామ)పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో స్థానం దక్కించుకున్నారు. కాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో ఉన్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News November 18, 2025

MBNR: పీయూలో “నషా ముక్త్ భారత్ అభియాన్”

image

పాలమూరు విశ్వవిద్యాలయం విద్యా కళాశాలలో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి తన సందేశంలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాళవి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనురాధ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

X(ట్విటర్) డౌన్

image

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT

News November 18, 2025

GWL: మాదక ద్రవ్యాలతో మనుగడకు ముప్పు-DMHO

image

మాదక ద్రవ్యాలతో మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో వైద్య సిబ్బందికి మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. మద్యం మత్తు జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.