News April 11, 2025
ఎన్టీఆర్: బీటెక్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో బీటెక్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4, 6వ సెమిస్టర్ థియరీ(రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి మే 7 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU వర్గాలు తెలిపాయి. సబ్జెక్ట్ వారీగా టైమ్ టేబుల్ పూర్తి వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చూడాలని కోరాయి.
Similar News
News March 7, 2026
MHBD: సమాజ అభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర: అదనపు కలెక్టర్

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మహబూబాబాద్ TGO జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ సమాజంలో ముందంజలో నిలుస్తున్నారని టీజీవో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ రఫీ అన్నారు.
News March 7, 2026
HYD: 2026-27 నుంచి NEP 2020 అమలు

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి. బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో జాతీయ విద్యా విధానం (NEP 2020) అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి CPGET ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతను కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగించినట్లు పేర్కొన్నారు.
News March 7, 2026
రాజమండ్రి కల్తీ పాలు.. మిస్టరీ వీడింది

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం <<19223408>>ఇథిలీన్ గ్లైకాల్<<>> అనే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు తెలిపారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిని పలువురు <<19320294>>మరణించినట్లు<<>> వివరించారు. కాగా గత నెలలో పాలను నిల్వ చేసే ఫ్రీజర్ చెడిపోవడంతో అందులోని కూలెంట్ లీకయ్యింది. పాలు చేదుగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేసినా వ్యాపారి గణేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.


