News March 21, 2024
ఎన్టీఆర్: బీసీ మంత్రం పని చేసేనా.?

మైలవరంలో వైసీపీ అభ్యర్థిగా జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన సర్నాల తిరుపతిని బరిలోకి దించారు. 2019లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన కృష్ణప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో జగన్ తిరుపతిని ఎంపిక చేశారు. 2014లో సైతం జగన్ బీసీ సామాజికవర్గానికి చెందిన జోగి రమేశ్కు మైలవరంలో అవకాశమివ్వగా ఆయన దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. తాజాగా 2024లో మైలవరంలో ఎలాంటి ఫలితం వస్తుందోనని జిల్లా మొత్తం ఆసక్తి నెలకొంది.
Similar News
News March 24, 2025
మచిలీపట్నంలో నేడు ‘మీకోసం’ కార్యక్రమం

కృష్ణా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో కోరారు. ఉదయం 11 గంటల నుంచి సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
News March 24, 2025
కృష్ణా: క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడవద్దు: ఎస్పీ

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని నమ్మి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడవద్దని ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెట్టింగ్ యాప్స్ మోసపూరితమైన వల అని, అందులో చిక్కుకొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఐపీఎల్, టీ 20 క్రికెట్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని అమాయకులను బలి చేస్తున్నారని అన్నారు.
News March 23, 2025
కృష్ణా: బీసీ, కాపు కార్పొరేషన్ రుణ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్టు బీసీ కార్పొరేషన్ కృష్ణా జిల్లా ఈడీ శంకరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ, కాపు, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపులు ఈనెల 25వ తేదీలోపు AP-OBMMS ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.