News March 26, 2024

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల రద్దీ మేరకు సికింద్రాబాద్(SC), అగర్తల(AGTL) మధ్య విజయవాడ మీదుగా నడిచే వీక్లి స్పెషల్ రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07030 SC- AGTL మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి సోమవారం, నెం.07029 AGTL- SC మధ్య నడిచే రైలును ఏప్రిల్ 5 నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు విజయవాడతో పాటు రాజమండ్రి, విశాఖ తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.

Similar News

News March 18, 2025

కృష్ణా: పెండింగ్ పనులు పూర్తి చేయాలి- కలెక్టర్

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఐసీడీఎస్, సీపీఓ, గనులు, జిల్లా పంచాయతీ తదితర శాఖల అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, ఎంపీ లాడ్స్, జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్, జడ్పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల భవనాల మరమ్మతులకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

News March 17, 2025

కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.

News March 17, 2025

కృష్ణా: జిల్లాలో TODAY TOP NEWS

image

★ కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు..<<15794120>> 286 గైర్హాజరు <<>>
★ కృష్ణా: Way2Newsతో విద్యార్థులు
★ కృష్ణా: టెన్త్ విద్యార్థులకు యూనిఫామ్<<15791358>> అనుమతి లేదు<<>>
★ అసెంబ్లీలో గన్నవరం <<15790326>>ఎమ్మెల్యే ఆవేదన<<>>
★ కృతి వెన్నులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
★ అవనిగడ్డలో కొడుకు ముందే తల్లి మరణం
★ పెడనలో టీడీపీ <<15787375>>నాయకుడిపై దాడి<<>>
★ గన్నవరంలో వెటర్నరీ విద్యార్థుల<<15792654>> ఆందోళన<<>>

error: Content is protected !!