News January 29, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

గుంటూరు(D) నంబూరులో జరుగుతున్న బైబిల్ మిషన్ సభలకు హాజరయ్యే వారికై ఎన్టీఆర్ జిల్లా మీదుగా ప్రయాణించే 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు రేపు బుధవారం నంబూరులో రైల్వే అధికారులు హాల్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు నం.17281 నరసాపురం- గుంటూరు, నం.17015 సికింద్రాబాద్- భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లు రేపు నంబూరులో ఆగుతాయని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News December 1, 2025
కడప: వాయిదా పడిన డిగ్రీ పరీక్ష.. మళ్లీ ఎప్పుడంటే.!

దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
News December 1, 2025
పార్వతీపురం: ‘అవగాహనతోనే ఎయిడ్స్ అంతం’

ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయగలమని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురంలో ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ ఆయన ప్రారంభించారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత జీవన విధానాలను పాటించాలని సూచించారు. HIV అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, సామాజిక సమస్య కూడా అని, దానిని అందరం కలిసి ఎదుర్కోవాలని అన్నారు.
News December 1, 2025
గద్వాల్: ఎయిడ్స్ బాధితుల హక్కులపై అవగాహన

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ.. హెచ్ఐవి/ఎయిడ్స్ బాధితుల హక్కుల పరిరక్షణలో న్యాయ సేవల సంస్థ చేస్తున్న సేవలను వివరించారు. ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యక్తులపై వివక్ష, మానసిక వేధింపులు గురించి వివరించారు.


