News January 29, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

గుంటూరు(D) నంబూరులో జరుగుతున్న బైబిల్ మిషన్ సభలకు హాజరయ్యే వారికై ఎన్టీఆర్ జిల్లా మీదుగా ప్రయాణించే 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు రేపు బుధవారం నంబూరులో రైల్వే అధికారులు హాల్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు నం.17281 నరసాపురం- గుంటూరు, నం.17015 సికింద్రాబాద్- భువనేశ్వర్ ఎక్స్ప్రెస్లు రేపు నంబూరులో ఆగుతాయని, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News December 5, 2025
NZB: బలిదానాలు పరిష్కారం కాదు.. ఐక్యపోరాటం చేద్దాం: కవిత

బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్య పోరాటాలు చేద్దామని, బలిదానాలు ఏమాత్రం పరిష్కారం కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మ బలిదానం చేసుకోవడం కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ అధికారం కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పడంతోనే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నారని ట్వీట్ చేశారు.
News December 5, 2025
భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది: మోదీ

ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నామని PM మోదీ తెలిపారు. ‘శాంతియుతమైన శాశ్వత పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నాలను IND స్వాగతిస్తోంది. మా దేశం తటస్థంగా లేదు. ఎప్పుడూ శాంతివైపే నిలబడుతుంది. ఉక్రెయిన్ విషయంలోనూ అదే కోరుకుంటోంది. భారత్-రష్యా స్నేహం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందనే నమ్మకం ఉంది. ఉగ్రవాదంపై ఇరుదేశాలు కలిసి పోరాడుతున్నాయి’ అని చెప్పారు.
News December 5, 2025
మంచి దర్శకుడు దొరికితే CBN బయోపిక్లో నటిస్తా: శివరాజ్కుమార్

AP: విలువలు కలిగిన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య బయోపిక్లో నటించడం గర్వంగా ఉందని కన్నడ హీరో శివరాజ్ కుమార్ తెలిపారు. అలాగే మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్లో ఆయన పాత్ర పోషించడానికి సిద్ధమన్నారు. రామ్చరణ్ ‘పెద్ది’ మూవీలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు చెప్పారు. కన్నడ ప్రజల మాదిరిగా తెలుగు ప్రేక్షకులూ తనను ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు.


