News March 28, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు. 

Similar News

News November 25, 2025

బ్రెస్ట్ నుంచి స్రావాలు వస్తున్నాయా?

image

రొమ్ములనుంచి ఎలాంటి స్రావాలు వచ్చినా క్యాన్సర్ అని చాలామంది భావిస్తారు. అయితే ఇదీ ఒక క్యాన్సర్ లక్షణమే కానీ, అన్నిసార్లూ అదే కారణం కాదంటున్నారు నిపుణులు. గెలాక్టోరియా వల్ల కూడా ఇలా జరగొచ్చంటున్నారు. ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదల కావడం, హైపోథైరాయిడిజమ్‌, కణితులు, లోదుస్తులు బిగుతుగా ఉండటం వల్ల కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

News November 25, 2025

GHMCలోకి మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు ఇవే!

image

☛మున్సిపాల్టీలు: పెద్దఅంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్
☛కార్పోరేషన్‌లు: బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, నిజాంపేట్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, బడంగ్‌పేట్ విలీనమవుతాయి.
☛ఇబ్రహీంపట్నం, కొత్తూర్, అలియాబాద్ లిస్ట్‌లో లేవు

News November 25, 2025

NTR: సాధారణ భక్తులకు అంతరాలయ దర్శనం

image

దుర్గమ్మ దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాధారణ భక్తులకు ఉచితంగా అంతరాయుల దర్శనం కల్పించారు. మధ్యాహ్నం 1,700 మంది సాధారణ భక్తులు దర్శించుకున్నారు. ప్రతి మంగళవారం ఏదో ఒక సమయంలో కనీసం 30నిముషాలు అంతరాలయ దర్శనం సామాన్య భక్తులకు కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వినూత్న ప్రయత్నంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.