News March 28, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News November 19, 2025
ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం: పాక్ నేత

ఇండియానే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రర్ గ్రూపులతో దాడులు చేస్తామని పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ హెచ్చరించారు. ఇప్పటికే తాము ఈ పని చేశామని, వారు బాడీలను లెక్కించలేకపోతున్నారంటూ విషం కక్కారు. బలూచిస్థాన్లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గామ్ అటాక్లనే అతను పరోక్షంగా ప్రస్తావించారు.
News November 19, 2025
నిర్మల్: ఈ నెల 21న U-14, 16 అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

జాతీయ స్థాయి అండర్-14, 16 బాలబాలికల శిక్షణ కోసం ఈ నెల 21న నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియంలో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పద్మనాభం గౌడ్ తెలిపారు. అండర్-14కు 21-12-2011 to 20-12-2013, అండర్-16కు 21-12-2009 to 20-12-2011 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 19, 2025
అనకాపల్లి: 2,42,480 మంది ఖాతాల్లో నగదు జమ

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ అయినట్లు జేసీ జాహ్నవి తెలిపారు. సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమంలో జేసీ జాహ్నవి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి రైతుకు ఈ పథకం కింద నిధులు జమ చేయడం జరిగిందన్నారు. రైతులకు చెక్కులను అందజేశారు.


