News March 28, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
Similar News
News November 18, 2025
వాట్సాప్లో మీసేవ సర్వీసులు ప్రారంభం

TG: మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్లోనే పొందచ్చు. ప్రజలు ఇంటి నుంచే విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి కూడా ఇంటి నుంచే పొందే వీలుంటుంది. ఇవన్నీ క్రమంగా వాట్సాప్లో అందుబాటులోకి రానున్నాయి.
News November 18, 2025
వాట్సాప్లో మీసేవ సర్వీసులు ప్రారంభం

TG: మీసేవ సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవలో పొందే మొత్తం 580 సేవలను వాట్సాప్లోనే పొందచ్చు. ప్రజలు ఇంటి నుంచే విద్యుత్ బిల్లు, ఆస్తి పన్ను చెల్లింపులు చేయొచ్చు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన/మరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి కూడా ఇంటి నుంచే పొందే వీలుంటుంది. ఇవన్నీ క్రమంగా వాట్సాప్లో అందుబాటులోకి రానున్నాయి.
News November 18, 2025
కామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం శాబ్దీనగర్ గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పనుల పురోగతిని పరిశీలించి లబ్ధిదారురాలు చింతల సుమలత ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల తీరు, బ్యాంక్ రుణం, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇసుక సరఫరా వంటి అంశాలపై లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఇసుక ఇబ్బందులు తలెత్తకుండా, పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


