News April 15, 2025
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

సికింద్రాబాద్ స్టేషనులో అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో విజయవాడ నుంచి బయలుదేరే శాతవాహన ఎక్స్ప్రెస్ల రూట్ను నుంచి రైల్వే అధికారులు మార్చారు. మంగళవారం నుంచి నం.12713 BZA- SC రైలు సికింద్రాబాద్కు బదులుగా కాచిగూడ, నం.12714 SC- BZA రైలు కాచిగూడ నుంచి బయలుదేరుతుందన్నారు. నం.12713 మధ్యాహ్నం 12.55కి కాచిగూడ చేరుకుంటుందని, తిరిగి (నం.12714)సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
INDvsSA.. 4వ T20 రద్దు?

IND-SA మధ్య 4వ T20 రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. 6.30PMకు టాస్ వేసే సమయంలోనే పొగమంచు కురుస్తుండడంతో విజిబిలిటీ లేదని మ్యాచ్ను అంపైర్లు పోస్ట్పోన్ చేశారు. రాత్రి కావడంతో పొగమంచు తీవ్రమవుతుంది. ప్లేయర్లు అనారోగ్యం బారినపడే ఛాన్స్ ఉండటంతో మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సుంది. 9pmకు మరోసారి అంపైర్లు పరిశీలించిన తర్వాత క్లారిటీ రానుంది.
News December 17, 2025
రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు: చంద్రబాబు

AP: రాష్ట్రంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వస్తాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు భూసేకరణ కీలకమని, ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాల కల్పన ఎలా చేయగలం అనే అంశంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
News December 17, 2025
గంభీరావుపేట సర్పంచ్గా పద్మ విజయం

గంభీరావుపేట మండల కేంద్రం గ్రామ సర్పంచ్గా మల్లుగారి పద్మ ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గంభీరావుపేట గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించి ఆశీర్వదించిన గ్రామస్థులందరికీ నూతన సర్పంచ్ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.


