News March 20, 2025
ఎన్టీఆర్: సింహాద్రి ఎక్స్ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్ప్రెస్లను దక్షిణ మధ్య రైల్వే రెండు రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 23,24 తేదీలలో గుంటూరు- విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్ప్రెస్ను మార్చి 24,25 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 13, 2025
హైదరాబాద్లో మెస్సీ షెడ్యూల్ ఇలా..

* రాత్రి.7.30 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ, రాహుల్ గాంధీ, CM రేవంత్
* 7.55 గంటలకు మ్యాచ్ కిక్ ఆఫ్
* 8.06 గంటలకు గ్రౌండ్లోకి మెస్సీ, రేవంత్
* 8.33 గంటలకు పెనాల్టీ షూటౌట్
* 8.53 గంటలకు మెస్సీ చేతులమీదుగా విజేతకు ‘GOAT’ కప్ ప్రదానం
* 8.54 గంటలకు మెస్సీని సత్కరించనున్న సీఎం
* 8.57 గంటలకు కార్యక్రమం ముగింపు
News December 13, 2025
మద్ది ఆలయ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్లాల్ ఈ నెల 12న జీవో 1568 జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు 20 రోజుల్లోగా తమ దరఖాస్తులను ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్వీ చందనకు అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News December 13, 2025
ఓరుగల్లు ఓటరూ.. 100% పోలింగ్ చేయలేమా?

ఉద్యోగం నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లిన జిల్లా ప్రజలు ఎన్నికలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. సెలవులు, సమయం లేక సొంతూరు వచ్చి ఓటేయట్లేదు. మీగ్రామం అభివృద్ధికి దూరమవడానికి ఇదికూడా కారణమే. మీరు ఎంచుకునే అభ్యర్థి ఐదేళ్లు చేసే అభివృద్ధిపైనే గ్రామం ఆధారపడుతుంది. రేపు ఎలాగూ సండే కాబట్టి ఊరెళ్లి ఓటేద్దాం. మొదటి విడతతో WGL-86.83, HNK-83.95, JNGM-87.33, MLG-78.65, MHBD-86.99, BHPL-82.26% మాత్రమే పోలింగ్ అయింది.


