News March 13, 2025

ఎన్టీఆర్: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్

image

విజయవాడ మీదుగా లింగంపల్లి(LPI)- కాకినాడ టౌన్(CCT) రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.07445 CCT- LPI రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు, నం.07446 LPI- CCT రైలు ఏప్రిల్ 3 నుంచి జూలై 1 వరకు సికింద్రాబాద్ స్టేషనులో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లకు పై తేదీలలో చర్లపల్లిలో స్టాప్ ఇచ్చామన్నారు.

Similar News

News December 4, 2025

The ‘Great’ హైదరాబాద్

image

విలీనంతో HYD దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. విలీనం అనంతరం బల్దియా స్థితి గతులను పరిశీలిస్తే..
GHMC విస్తీర్ణం: 2735 చదరపు కిలో మీటర్లు
జనాభా: దాదాపు కోటిన్నర
మేయర్, 149 మంది కార్పొరేటర్లు+300 డివిజన్లకు ఆస్కారం
కమిషనర్, 10 మంది అదనపు కమిషన్లర్లు
23 మంది MLAలు+కొత్తగా ఇద్దరు MLAలు?
6 జోన్‌లు+ఆరుగురు జోనల్ కమిషనర్లు
57 సర్కిళ్లు+57మంది డిప్యూటీ కమిషనర్లు

News December 4, 2025

ఏపీకి రూ.125కోట్లు మంజూరు: పెమ్మసాని

image

AP: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.125 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడం, 10 పట్టణ స్థానిక సంస్థల్లో(ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. PM మోదీ దూరదృష్టితో సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ నాయకత్వంలో రాష్ట్రంలో పాలన మరింత బలోపేతమైందని ట్వీట్ చేశారు.

News December 4, 2025

వేగంగా వంద రోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్

image

ఉప్పాడ సముద్ర తీర ప్రాంత ప్రజలకు మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు వందరోజుల ఉప్పాడ యాక్షన్ ప్లాన్ వేగంగా రూపొందుతుంది. పవన్ కళ్యాణ్ స్థానిక అధికారులతో చర్చించి తమిళనాడు, కేరళలో విజయవంతంగా అమలు అవుతున్న సముద్ర ఉత్పత్తులతో ఆదాయం పెంపు విధానాలను పరిశీలించేందుకు ఉప్పాడ నుంచి 60 మంది మత్స్యకారుల ప్రత్యేక బృందాన్ని పవన్ కళ్యాణ్ పంపనున్నారు.