News January 23, 2025
ఎన్టీఎస్ఈ స్కాలర్షిప్ పునరుద్ధరణ చేయాలి: తిరుపతి ఎంపీ

ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్టిఎస్ఇ) స్కాలర్షిప్ను పునరుద్ధరించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి లేఖ రాశారు. ఎన్టీఎస్ఈ స్కాలర్షిప్ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
Similar News
News February 15, 2025
ఉలవపాడు: BPCL రిఫైనరీని వ్యతిరేకిస్తూ సమావేశం

రామాయపట్నం పోర్ట్ ఆధారంగా 6 వేల ఎకరాలలో BPCL తలపెట్టిన రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుకు ఆదిలోనే గండం ఏర్పడింది. BPCL కోసం తమ భూములను వదులుకునే ప్రసక్తే లేదని సముద్ర తీర గ్రామాలకు చెందిన మత్స్యకార రైతులు శుక్రవారం తేల్చి చెప్పారు. కరేడు పంచాయితీలోని అలగాయపాలెంలో రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాలెం తదితర గ్రామాల మత్స్యకారులు పెద్ద సంఖ్యలో సమావేశమై ప్రభుత్వం చేసే బలవంతపు భూసేకరణను ప్రతిఘటించాలని తీర్మానించారు
News February 15, 2025
నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఉపాధ్యాయుడిపై కేసు

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.
News February 15, 2025
నెల్లూరు: పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.