News March 26, 2025
ఎన్డీఏ ఎంపీల సమావేశానికి విజయవాడ ఎంపీ హాజరు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గాల సమస్యలు, కేంద్ర పథకాల అమలు, నిధుల అవసరాలను, తెలుసుకునేందుకు కేంద్రమంత్రులకు కొంతమంది ఎంపీలను గ్రూపులుగా అప్పగించి ప్రతి 3 నెలకు ఒకసారి సమావేశానికి ఆదేశించింది.
Similar News
News April 23, 2025
వికారాబాద్: జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: స్పీకర్

జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా సరైన విధంగా నీరు అందించాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు ప్రతిఇంటికి అందించాలన్నారు.
News April 23, 2025
27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు: ఖమ్మం DEO

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27న (ఆదివారం) నాడు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7-10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడతాయని చెప్పారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ వదంతులు నమ్మవద్దని సూచించారు.
News April 23, 2025
ADB: ఈనెల 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

వరంగల్ కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ(బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చన్నారు.